చాలాకాలం తర్వాత ప్రేక్షకుల మనసు దోచిన చిత్రం సీతారామం. సినిమాతో బాగా ఆకట్టుకున్నారు నటుడు దుల్కర్ సల్మాన్.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించారు. ఎలాంటి అంచనాలు లేకుండా గత ఏడాది అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా థియేటర్లు విడుదలై కలెక్షన్ల పరంగా బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. మాస్ యాక్షన్ చిత్రాలే కాకుండా క్లాస్ సినిమాలను కూడా ఆడియన్స్ ఆదరిస్తారని విషయాన్ని ఈ చిత్రం మరొకసారి నిరూపించింది.
ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వని దత్ నిర్మించారు. ఈ సినిమా తో తెలుగులో దుల్కర్ సల్మాన్.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మంచి పాపులారిటీ సంపాదించారు. వీరిద్దరూ సహజమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ చిత్రం తర్వాత మృణాల్ ఠాకూర్ తెలుగులో ఎక్కువ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నాని సరసన సరికొత్త ప్రాజెక్టుతో ముందుకు రాబోతోంది.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది తాజాగా అభిమానులతో ట్విట్టర్ వేదికగా ఈ ముద్దుగుమ్మ ముచ్చటించడం జరిగింది.. ఈ సమయంలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలతో తనదైన స్టైల్ లో సమాధానాలు ఇచ్చింది.. సీతారామం -2 సినిమా సాధ్యమేనా అనే ప్రశ్న ఒక నేటిజన్ ప్రశ్నించాగా..మృణాల్ ఠాకూర్ ఈ విషయంపై స్పందిస్తూ నాకు నిజంగానే ఆలోచన లేదు కానీ నేను ఉండాలనుకుంటున్నాను అని తెలిపింది.. ఏపీ లవ్ స్టోరీకి సీక్వెల్ పైన అందరిలో ఆసక్తి నేలకొంటోంది. ఈ క్రమంలోని ఇటీవల ఆమె షేర్ చేసిన ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
https://twitter.com/mrunal0801/status/1645028690697519104?s=20