సీనియార్ స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాలా నటనకు భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఉన్నారు. మనీషా కోయిరాలా నటించిన సినిమాల్లో చాలా సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. దాంతో ఈమెకు మంచి పేరు కూడా వచ్చింది. ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు, తమిళ్ ప్రేక్షకులనే కాకుండా హిందీ ఆడియన్స్ని కూడా తన వైపు తిప్పుకున్న మనీషా కొయిరాలా ఇటీవల తన బాధను.. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా వెల్లడించారు.
నేపాల్కు చెందిన సామ్రాట్ దహాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈమె పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.పెళ్లి తర్వాత ఎన్నో కలలు కన్నానని అయితే కేవలం ఆరు నెలలకే తన భర్తతో గొడవలు మొదలయ్యాయని.. తాను ప్రేమించిన వ్యక్తి తనకు శత్రువుగా మారాడు. ఆఖరికి కడతేర్చాలనుకున్నాడు అంటూ ఏంతో భావోద్వేగానికి గురైంది.
ఒక అమ్మయి పుట్టింటిని వద్దలి మెట్టినింటికి వెళ్లిన తర్వాత తన భర్తే తనకు సర్వస్వంగా భావిస్తుటుంది. అలాంటి భర్తే ఆమేను చంపలని చూడడం ఎంతో దారుణం అన్ని ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. అలా జరగడం వల్లే విడాకులు తీసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. నేను ఫేస్ చేస్తున్న సమస్య లాంటి సమస్య ఇంకెవరికీ రాకూడదని మనీషా కామెంట్లు చేసింది. ఇలా నేను మాత్రమే కాదు అన్నిపెళ్ళి బంధంలో ఎవరైన సరే సంతోషంగా లేనప్పుడు విడిపోవడమే మంచిది అంటూ సూచనలు కూడా చేసింది.
ఇప్పుడు మనీషా కొయిరాలా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఆమె ఒంటరి జీవితాన్ని అయినా సంతోషంగా గడపాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ నటి పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. ఈ నటి వరుస సినిమాలతో బిజీ కావడంతో పాటు సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.