మొదటి భార్య‌తో మ‌నోజ్ ఎందుకు విడిపోయాడో తెలుసా.. తొలిసారి ఓపెన్ అయిన మంచు హీరో!

మంచు మ‌నోజ్ ఇటీవ‌ల ఓ ఇంటివాడు అయిన సంగ‌తి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డితో మ‌నోజ్ ఏడ‌డుగులు వేశారు. గ‌త నెల‌లో మంచు ల‌క్ష్మి నివాసంలో మ‌నోజ్‌, మౌనిక వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఇద్ద‌రికీ ఇది రెండో వివాహ‌మే. మ‌నోజ్ మొద‌ట ప్ర‌ణ‌తి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరిది ప్రేమ వివాహం.

2015వ సంవత్సరం లో వీళ్లిద్దరి పెళ్లిని అతిరథ మహారథుల సమక్ష్యం లో మోహన్ బాబు అంగరంగ వైభవం గా జరిపించాడు. కొంతకాలం దాంపత్య జీవితం బాగానే సాగింది. కానీ, అనూహ్యంగా 2019లో వీరిద్ద‌రూ విడాకులు తీసుకున్నారు. అయితే మొద‌టి భార్య‌తో విడిపోవ‌డంపై మ‌నోజ్ తొలిసారి స్పందించాడు.

తాజాగా మౌనిక‌తో క‌లిసి మ‌నోజ్ వెన్నెల కిషోర్ హోస్టింగ్ చేస్తున్న `అలా..మొద‌లైంది` షోలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా మొద‌టి పెళ్లి గురించి మాట్లాడారు. `నేను లవ్ లైఫ్ కావాలా? లేకపోతే నా అభిరుచికి తగ్గ సినిమాలు ఎంచుకోవాలా అనేది తెలియని సందిగ్ధ పరిస్థితిలో పడ్డాను. నేను చాలా కష్టమైన సమయాన్ని ఎదుర్కొన్నాను. నేను ఇచ్చిన ప్రేమ పరస్పరం తిరిగి రాలేదు. చాలా సార్లు నేను తన (ప్రణతి) కోసం ఇష్టం లేని పనులు చేయాల్సొచ్చింది. నాకు అసౌకర్యంగా అనిపించింది. ఒక టైమ్ లో నేను ఎక్కడ నిలబడి ఉన్నాను? ఎవరి కోసం నిలబడ్డానో తెలియక తికమక పడ్డాను. అప్పుడే విడాకులు తీసుకున్నాను` అంటూ మ‌నోజ్ చెప్పుకొచ్చాడు. దీంతో మ‌నోజ్ కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.