బాయ్‌ఫ్రెండ్‌తో జాన్వీ క‌పూర్ షికార్లు.. ఇంత‌కీ ఎవ‌రీ శిఖ‌ర్‌?

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ముద్దుల కుమార్తె, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ శిఖ‌ర్ ప‌హ‌రియాతో ప్రేమ‌లో ఉంద‌ని ఎప్ప‌టి నుంచో బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ప‌లు మార్లు వీరిద్ద‌రూ షికార్లు చేస్తూ మీడియాకు చిక్కారు. తాజాగా మ‌రోసారి జంట‌గా అడ్డంగా దొరికేశారు.

అయితే బాయ్‌ఫ్రెండ్‌తో క‌లిసి తాజాగా ముంబైలోని క‌లినా ఎయిర్‌పోర్టులో ద‌ర్శ‌న‌మిచ్చింది జాన్వీ. వైట్ ట్విన్నింగ్ అవుట్ ఫిట్ లో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి బ‌య‌ట‌కు రాగానే.. ఇద్ద‌రూ వేర్వేరు కార్ల‌లో వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. మార్చి 31వ తేదీన నీతా అంబానీ ఈవెంట్‌కు జాన్వీతో పాటు ఆమె శిఖ‌ర్ కూడా హాజ‌రు.

అనంత‌రం వీరిద్ద‌రూ క‌లిసే వ‌చ్చారు. దీంతో మ‌రోసారి వీరి డేటింగ్ వార్త‌లు ఊపందుకున్నాయి. కానీ, జాన్వీ-శిఖ‌ర్ మాత్రం త‌మ రిలేష‌న్ పై నోరు విప్ప‌డం లేదు. ఇక‌పోతే శిఖ‌ర్ గురించి సౌత్ సినీ ప్రియుల‌కు పెద్ద‌గా తెలియ‌దు. మ‌హారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మ‌నువ‌డే శిఖ‌ర్ ప‌హ‌రియా. జాన్వీతో రిలేష‌న్ కార‌ణంగా బీటౌన్‌లో శిఖ‌ర్ బాగా పాపుల‌ర్ అయ్యాడు.

https://www.instagram.com/reel/CqdN2qXO0T6/?utm_source=ig_web_copy_link