జంతువులతో పోలుస్తూ దారుణమైన కామెంట్లు చేశారు.. లేడీ కమెడియన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్లు గా ఎంతోమంది ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన వారు ఉన్నారు. అలా తనకంటూ ఇండస్ట్రీలో ఒక గుర్తింపును సంపాదించుకుంది నటి విద్యుల్లేఖ రామన్.. ప్రస్తుతం అడపా దడప సినిమాలలో చేస్తున్నప్పటికీ గతంలో ఎన్నో చిత్రాలలో హీరోయిన్లకు ఫ్రెండ్ క్యారెక్టర్లలో నటించి తన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా కడుపుబ్బ నవ్విస్తూ ఉండేది.. తాజాగా ఒక బుల్లి తెర షోలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ పడు ఆసక్తికరమైన విషయాలు తెలిపింది.

When Is Your Divorce?": What Trolls Told Actress Vidyulekha Raman On  Swimsuit Pic
విద్యుల్లేఖ రామన్ మాట్లాడుతూ తనను కూడా చాలామంది ట్రోల్ చేశారని తెలియజేస్తోంది.పంది, ఏనుగు అంటూ నన్ను వేరు వేరు జంతువులతో పోలుస్తూ చాలా దారుణమైన కామెంట్లు చేసేవారని అలా చేసే కామెంట్లు తనకి ఒక్కొక్కసారి బాధ కలిగించిన ఒక్కొక్కసారి లైట్ గా తీసుకునే దాన్ని అంటూ తెలిపింది. కానీ తనకు వివాహమై హనీమూన్ కి వెళ్ళిన సమయంలో స్విమ్ సూట్ వేసుకున్నానని తెలియజేసింది. ఆ సమయంలో కూడా కొంతమంది తన గురించి కామెంట్లు చేశారని తెలియజేసింది.

vidyullekha movies | Zee News Telugu

ఆ ఫోటోలను చూసిన కొంతమంది ఛి ఇది ఒక అమ్మాయి అయినా అంటూ తిట్టారని తెలియజేస్తోంది. ప్రస్తుతం విద్యుల్లేఖ రామన్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇతరులను కామెంట్ చేసేవాళ్లు తమను ఎవరైనా ట్రోల్ చేస్తే మాత్రమే ఆ బాధ అర్థం అవుతుందని తెలియజేసింది.. ఇక హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా గర్భవతిగా ఉన్న సమయంలో ఆమె పైన పలు రకాలుగా ట్రోల్స్ వినిపించాయి.. సోషల్ మీడియా వినియోగం వల్ల ఈ మధ్యకాలంలో తరచూ ఎవరో ఒకరు ట్రోల్కు గురవుతూనే ఉన్నారని తెలుపుతోంది. ప్రస్తుతం తన జీవితాన్ని మాత్రం ఎంజాయ్ చేస్తున్నానని రాబోయే రోజుల్లో సినిమాలలో నటిస్తానని తెలుపుతోంది.