తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి కూడా స్టార్ హీరోగా పేరుపొందారు. RRR సినిమాతో కూడా ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా పేరుపొందారు. తాజాగా ఎన్టీఆర్ 30వ సినిమా అని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ తన ఇంట్లో గ్రాండ్ గా పార్టీ ఇచ్చినట్లు కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
ఈ డిన్నర్ నైట్ కి రాజమౌళి, కొరటాల శివ, మైత్రి మూవీస్ మేకర్స్ వారు తోపాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.. అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ జేమ్స్ ఫెర్రల్ కూడ ఈ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తన నివాసంలో జరిగిన ఈ పార్టీ గురించి ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా తెలియజేయడం జరిగింది. స్నేహితులతో గడిపిన ఈ క్షణాలు అద్భుతం అంటూ ఎన్టీఆర్ తన ట్విట్టర్ నుంచి షేర్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ సడన్గా ఈవెంట్ ఏర్పాటు చేయడం వెనక కారణాలపైన పలు చర్చలు జరుగుతున్నాయి.
అమెజాన్ స్టూడియోస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫెర్రల్ హాజరు కావడం కూడా ప్రాధాన్యం అని చెప్పవచ్చు. RRR సినిమాతో ఆస్కార్ గెలిచిన నేపథ్యంలో రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గ్రాండ్గా పార్టీని జరుపుకున్నారు. ఆస్కార్ విజయాన్ని పుట్టినరోజు కలిపి తన నివాసంలో భారీగా విందు ఏర్పాటు చేయడం జరిగింది.. దాదాపుగా టాలీవుడ్ మొత్తం ఈ పార్టీకి హాజరయ్యారు..
రామ్ చరణ్ ఎన్టీఆర్ మిత్రుడుగా భావిస్తూ ఉన్నప్పటికీ.. ఎన్టీఆర్ హైదరాబాదులో ఉండి కూడా రాకపోవడంతో ఆశ్చర్యపోతున్నారు.. ఎన్టీఆర్ నివాసములో జరిగిన ఈ పార్టీకి రామ్ చరణ్ కూడా రాలేదు. అయితే ఆయన రాకపోవడానికి కారణం ఏంటి ప్రస్తుతం ఇండియాలో లేరు తన భార్యతో కలిసి దుబాయిలో ఎంజాయ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎన్టీఆర్, చరణ మధ్య మనస్పర్ధలకు దారితీసిందేమో అని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
https://twitter.com/tarak9999/status/1646218801577615365?s=20