దుష్యంతుడిగా మెప్పించిన దేవ్ మోహన్ `శాకుంత‌లం`కు ఎంత తీసుకున్నాడో తెలుసా?

దేవ్ మోహ‌న్‌.. ఇత‌గాడి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. మ‌రోవైపు మోడలింగ్ వృత్తిని ప్రారంభించాడు. సినిమాల్లోకి రావాల‌న్న కోరిక లేక‌పోయినా.. అనుకోకుండా 2020లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన సూఫియుమ్ సుజాతాయుమ్ అనే మ‌ల‌యాళ చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేశాడు.

ఆ త‌ర్వాత రెండు, మూడు మ‌ల‌యాళ చిత్రాల్లో మెరిసిన దేవ్ మోహ‌న్‌.. `శాకుంత‌లం` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యాడు. స‌మంత హీరోయిన్‌గా గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కించిన ఈ సినిమా భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 14న విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. అయితే ఈ చిత్రంలో దుష్యంతుడిగా మాత్రం దేవ్ మోహ‌న్ అద్భుతంగా మెప్పించారు.

త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి. అయితే దేవ్ మోహ‌న్‌ శాకుంత‌లంకు ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడో తెలుసా.. రూ. 1.75 కోట్లు. యంగ్ హీరో కావ‌డం.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అడుగులు వేస్తుండ‌టం నేప‌థ్యంలోనే దేవ్ మోహ‌న్ అంత త‌క్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడ‌ట‌. ఇక శాకుంత‌లం రిలీజ్ కు ముందే ర‌ష్మిక‌తో `రెయిన్ బో` అనే సినిమాకు సైన్ చేశాడు. ఈ మూవీ ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లింది.