అలనాటి హీరోలలో సీనియర్ నటుడు శరత్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒకవైపు ఎన్నో చిత్రాలలో హీరోగా, విలన్ గా కూడా నటించి మెప్పించారు.. ఇప్పటికి అడపా దడపా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉన్నారు శరత్ బాబు.. కానీ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న శరత్ బాబు ఇటీవల హైదరాబాదులో AIG ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది.గత కొంతకాలం క్రితం శరత్ బాబు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో చెన్నైలో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
శరత్ బాబును గత కొద్ది వారాల క్రితం వైద్యులు సూచించిన మేరకు బెంగళూరులో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం శరత్ బాబుని ఈనెల 20వ తేదీన హైదరాబాద్ కి మార్చారట. ఆ సమయంలోనే శరత్ బాబుకు మల్టీ ఆర్గాన్ డ్యామేజ్ అయినట్లుగా వైద్యులు గుర్తించారు. దీంతో కిడ్నీ ఫెయిల్యూర్ ,లంగ్స్ ఇన్ఫెక్షన్తో ఆయన చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం శరత్ బాబు గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రిలో ఐసియులో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
ఆయన పరిస్థితి ప్రస్తుతం విషయం గానే ఉందని వైద్యులు అయితే తెలియజేస్తున్నారు. ఎన్నో చిత్రాలలో వైవిద్యమైన పాత్రలు చేసి నటుడుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న శరత్ బాబు.ప్రస్తుతం శరత్ బాబు వయసు 72 సంవత్సరాలు.చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ కి వచ్చినప్పటికీ కూడా ఆయన చెన్నైలోనే సెటిల్ అయ్యారు. ఈయన గత కొంతకాలంగా సెప్సిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.దీని కారణంగానే కిడ్నీలు ఊపిరితిత్తులు లివర్ సమస్యలు ఏర్పడ్డాయని వైద్యులు తెలియజేశారు. ప్రస్తుతం ఈయన వెంటిలేటర్ పైన చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.