ఏ ఇండస్ట్రీలో నైనా హీరో ,హీరోయిన్స్ మధ్య పలు పుకార్లు పుట్టుకొస్తూనే ఉంటాయి..ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. సెలబ్రిటీలు కొంతమంది వాటిని సీరియస్ గా తీసుకొని రియాక్ట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా అఖిల్ పైన తప్పుడు వార్తలు రాసిన ఒక సినీ క్రిటిక్ కు లీగల్ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఊర్వశి రౌతేలా తెలుగులో కూడా పలు చిత్రాలలో ఆ ఐటెం సాంగ్లలో కూడా నటించింది. వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా స్పెషల్ సాంగ్లో అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అఖిల్ నటిస్తున్న ఏజెంట్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో చేసింది. ఈ ముద్దుగుమ్మ అంద చందాలతో మెప్పించింది .. అమెరికాలో ఉండి ఇండియన్ సినిమాల గురించి రాసే సినీ క్రెటిట్ ఉమైర్ సందు రెగ్యులర్గా వివాదమయ్య వీట్లను చేస్తూ ఉంటారు దీంతో పలువురు బాలీవుడ్ హీరో హీరోయిన్స్ గురించి తప్పుడు వార్తలు రాస్తూ ఉన్నారు.
గడచిన కొద్ది రోజుల క్రితం ఒక ట్వీట్లో ఏజెంట్ సినిమాలో ఐటెం సాంగ్ సమయంలో అఖిల్..ఊర్వశి రౌతేలా ను ఏడిపించారని ఆమెతో చాలా మిస్ బిహేవియర్ చేశారని అతనితో వర్కు చేయడం ఊర్వశి రౌతేలా చాలా ఇబ్బందికరంగా అనిపించిందని ట్విట్ చేశారు. దీంతో ఈ విషయం వైరల్ కావడంతో..ఊర్వశి రౌతేలా దృష్టికి వెళ్లిన ఈ విషయంపై ఆమె చాలా సీరియస్ అయింది. అంతేకాకుండా తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేస్తూ లీగల్ నోటీసులు పంపిస్తున్నానంటూ తన లీగల్ టీము సంబంధించి ఒక పోస్ట్ని విడుదల చేసింది. నువ్వే మెచ్యూరిటీ లేని జర్నలిస్ట్ వి.. నేను నా ఫ్యామిలీ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేలా చేశావు అంటూ పోస్ట్ చేసింది. తనతో.. ఎవరు కూడా ఎలాంటి మిస్ బిహేవియర్ చేయలేదంటూ ఫైర్ అవుతోంది. నువ్వు రాసిన వారిని ఫేక్ వార్తలు అంటూ కోట్టి పారేసింది.
ఈమె దీంతో అఖిల్ పై వచ్చిన వార్తలన్నీ ఒక ఫేక్ రూమర్స్ అన్నట్లుగా తేలిపోయింది.
View this post on Instagram