ఈ యాంకర్లు, సీరియల్ నటీమణులకు మన హీరోయిన్లు సరిపోరు సంపాదనలో!

సాధారణంగా ఇండియన్ సినిమా పరిశ్రమని మొత్తంగా పరిశీలిస్తే, టాలీవుడ్లో ఆర్టిస్టులకు అందిస్తున్న రెమ్యునరేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ వివిధ భాషలవారు తారసపడుతూ వుంటారు. ఈ క్రమంలో సినిమా సినిమా హీరోయిన్లు దండిగానే సంపాదిస్తున్నారు. ఇంకా ఇక్కడ బుల్లితెర ఆర్టిస్టులు కూడా తక్కువేం తినలేదు. ఇక్కడ కొంతమంది ఆర్టిస్టులు సినిమా హీరోయిన్లకంటే కూడా ఎక్కువగా సంపాదించిన దాఖలాలు వున్నాయి. వీళ్ళు కూడా వీలైనప్పుడు వెండితెరపైన అలా కనిపించి వెళ్లిపోతుంటారు.

ఈ లిస్టులో యాంకర్ సుమ మొదటి స్థానంలో ఉంటుంది. సుమ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఒక షోకి గాని, ఈవెంట్ కి గాను సుమారు రూ. 3.5 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందని సమాచారం. అదే షోస్ కి అయితే ఒక్క ఎపిసోడ్ కి 3 లక్షల వరకు తీసుకుంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. తరువాత యాంకర్ అనసూయ గురించి చెప్పుకోవాలి. ఈమె ఒక పక్క సినిమాలు చేస్తూ మరొక పక్క ఈవెంట్స్ చేస్తూ ఉంటుంది. ఈమె ఒక్కో ఈవెంట్ కి దాదాపుగా 2 నుండి 3 లక్షల వరకు తీసుకుంటుందని సమాచారం.

ఆ తరువాత రష్మీ గౌతమ్ గురించి మాట్లాడుకోవాలి. జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటి సంపాదించిన ఈ అమ్మడు టీవీ షోస్ చేస్తూనే మరోపక్క సినిమాలు కూడా చేస్తుంది. రష్మీ ఒక్కో ఈవెంట్ కి 3 లక్షల వరకు డిమాండ్ చేస్తుంది. ఇక ప్రేమి విశ్వనాథ్ గురించి తెలిసిందే. కార్తిక దీపం సీరియల్ లో వంటలక్కగా ఫేమస్ అయినా ప్రేమి విశ్వనాథ్ రోజుకి 25 వేలు పారితోషికం అందుకుంటుంది. ఒకప్పుడు చంటిగాడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన సుహాసిని తర్వాత హీరోయిన్ గా ఛాన్సులు రాకపోవడంతో సీరియల్స్ లో నటిస్తూ ఇపుడు రోజుకి 20 వేల పారితోషకం తీసుకుంటుంది. అలాగే బుల్లితెరలో సీరియల్స్ బిజీగా ఉన్న నవ్య స్వామి రోజుకి 20 వేల వరకు పారితోషకం అందుకుంటుంది.