టీడీపీకి పట్టులేని స్థానాల్లో బాబు ఫోకస్..భారీ ప్లాన్.!

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో టి‌డి‌పి బలపడటమే లక్ష్యంగా పనిచేత్సున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ..నాయకులకు దిశానిర్దేశం చేస్తూ..ఇంకా దూకుడుగా పనిచేసేలా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా నియోజకవర్గాల్లో టి‌డి‌పి బలపడుతూ వచ్చింది. అయితే పార్టీ ఇంకా కొన్ని స్థానాల్లో టి‌డి‌పి బలపడాల్సి ఉంది.

ఇప్పుడు ఆ స్థానాల్లో బాబు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన జిల్లాల పర్యటన చేపట్టారు. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం స్థానాల్లో ఆయన పర్యటించనున్నారు. వీటిల్లో నూజివీడు, గుడివాడ స్థానాల్లో టి‌డి‌పి బలం గా లేదు. దీంతో ఆయా స్థానాలపై బాబు ఫోకస్ పెట్టి, ప్రజల్లోకి వెళ్ళి, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నారు. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంపై ఫోకస్ పెట్టారు. బేసిక్ గా అక్కడ టి‌డి‌పికి పెద్ద పట్టు లేదనే చెప్పాలి.

గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం స్థానాల్లో అసలు టి‌డి‌పికి బలం లేదు..కొన్ని ఎన్నికల నుంచి ఆ స్థానాల్లో టి‌డి‌పి గెలవడం లేదు. అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపు ఛాన్స్ లేదని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆయన ఆ మూడు స్థానాల్లో పర్యటించడానికి రెడీ అయ్యారు.

ఈ నెల 19వ తేదీన గిద్దలూరు, 20న మార్కాపురం, 21న యర్రగొండపాలెంలో ఆయన పర్యటిస్తారు. రోడ్ షో, భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అయితే బాబు పర్యటనలు ఈ మధ్య సక్సెస్ అవుతున్న విషయం తెలిసిందే. భారీగా జనాలు వస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ ప్రకాశంలో కూడా సభలు గ్రాండ్ సక్సెస్ చేసి..ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాలని బాబు ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ స్థానాల్లో పార్టీ పికప్ అవుతుందేమో చూడాలి.