బ్రేకింగ్: ఆసుపత్రి పాలైన హీరోయిన్ ఖుష్బూ.. ఆందోళనలో అభిమానులు..!!

దక్షిణాది ప్రేక్షకులకు హీరోయిన్ ఖుష్బూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఎన్నో వరుస సూపర్ హిట్ చిత్రాలలో నటించి అగ్ర హీరోయిన్గా పేరుపొందింది. ఇప్పుడు ఈమె పలు సినిమాలలో సహాయక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంది ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది. భారతీయ జనతా పార్టీల కీలక సభ్యురాలుగా కొనసాగుతోంది ఖుష్బూ. అయితే తాజాగా ఈమె అపోలో ఆసుపత్రిలో హైదరాబాదులో చేరినట్టుగా కొన్ని ఫోటోలను విడుదల చేయడం జరిగింది..

Khushbu hospitalized : திடீரென மருத்துவமனையில் அனுமதி... நடிகை குஷ்புவுக்கு  என்னாச்சு?

దీంతో అభిమానులు సైతం కాస్త ఆందోళనకు గురవుతున్నారు.. పూర్తి వివరాల్లోకి వెళితే ఖుష్బూ జ్వరం శరీరం నొప్పి బలహీనతతో ఆసుపత్రిలో చేరినట్లుగా తన ట్విట్టర్ నుంచి తెలియజేసింది. ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి సంకేతాలను అయినా పట్టించుకోకుండా ఉండకండి అంటూ అభిమానులకు సూచిస్తోంది.. ఏప్రిల్ 7వ తేదీన ఈ అమ్మడు జ్వరం బలహీనతతో హైదరాబాదులో అపోలో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది.. ప్లూ చాలా చెడ్డది ఇది నా ఆరోగ్యం పైన ఎక్కువ ప్రభావం చూపిస్తోంది అంటూ తెలియజేసింది.

అంతేకాకుండా జ్వరము శరీరం నొప్పులు బలహీనతతో అడ్మిట్ అయ్యాను అదృష్టవశాత్తు అపోలో వైద్యులు తన ఆరోగ్యానికి సహకరించారని అనారోగ్యానికి గురైనట్లుగా లక్షణాలు కనిపిస్తే ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దండి అంటూ రాసుకుంది ఇక ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలని పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవలే ఖుష్బూ విజయ్ దళపతి రష్మిక నటించిన వారిసు చిత్రం లో నటించింది. ఆమెకు సంబంధించిన పోస్టర్లను సైతం విడుదల చేయడం జరిగింది. కానీ థియేటర్లో సినిమా విడుదలయ్యాక ఎక్కడ ఈమె కనిపించలేదు దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

https://twitter.com/khushsundar/status/1644230692115746816?s=20