అక్కినేని అఖిల్, ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఏజెంట్`. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఈ బ్యూటీకి ఇదే తొలి చిత్రం.
అలాగే మలయాళ స్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించారు. స్పై థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వరంగల్ లో నిర్వహించారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యూనిట్ మొత్తం మూవీపై బలమైన నమ్మకం లేనట్లు మాట్లాడారు.
అఖిల్ మాట్లాడుతూ `కలిసినప్పుడు ఎదో ఒకటి క్రేజీ గా చెయ్యాలని అనుకున్నాము. కానీ ఎదో చేశాము సార్’ అంటూ సురేందర్ ను చూస్తూ మాట్లాడు. అఖిల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఆ మాట చెప్తున్నప్పుడు అఖిల్ ముఖకవళికలు చూస్తే సినిమా ఔట్పుట్ మీద నమ్మకం లేనట్టుగా అనిపించింది. కొందరైతే ఏజెంట్ అట్టర్ ఫ్లాప్ అని అఖిల్ పరోక్షంగా చెప్పేశాడంటూ అభిప్రాయపడుతున్నారు.