సౌందర్య.. ఈ లోకాన్ని విడిచి ఎన్నో ఏళ్లు అయిపోయినా సినీ ప్రియులు గుండెల్లో మాత్రం అలానే ఉండిపోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న సౌందర్య అతి చిన్న వయసులోనే హెలికాప్టర్ ప్రమాదంలో తనువు చాలించడం అందరినీ ఎంతలా కలచివేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల్లో రాణిస్తున్న టైమ్ లోనే సౌందర్య బిజెపి పార్టీలో చేరారు.
పార్టీ ప్రచారం కోసం హెలికాప్టర్ లో వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో సౌందర్య సోదరుడు అమర్ కూడా మృతి చెందారు. అయితే తాజాగా సౌందర్య సహనటి, సన్నిహితులు ప్రేమ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేమ సౌందర్య మృతిని తల్చుకుని ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
సౌందర్య చనిపోయిన రోజు.. ఇంతేనా జీవితం అనిపించింది. ఇంటికి వెళ్లగానే ఎదురుగా సౌందర్య, ఆమె బ్రదర్ ఫోటోస్ పెట్టి ఉన్నాయి. వాళ్ల బాడీలను బాక్స్ లో పెట్టి ఉంచారు తల లేదు. మొండెం మాత్రమే ఉంది. అక్కడ వాళ్ల అమ్మగారని చూసి చలించిపోయాను. ఇంతేనా ఆర్టిస్ట్ జీవితం అనిపించింది. మనం పోయేటప్పుడు తీసుకెళ్లేది కర్మ, గౌరవం తప్ప ఏమీ లేదు అనిపించింది. ఇక సౌందర్యతో నటించే రోజులు చాలా బాగుండేవి. తను చాలా తక్కువ తినేది. పప్పు, పాలక్, నెయ్యి, గోంగూర పచ్చడి.. అవన్నీ తినడం ఆమె దగ్గరే నేర్చుకున్నారు. ఆమెను ఎప్పటికీ మరచిపోలేను. ఆమె రూపం ఇప్పటికీ అలానే నా మైండ్ లో గుర్తుండిపోయింది` అంటూ ప్రేమ చెప్పుకొచ్చింది.