కన్నీళ్లు పెట్టుకుంటున్న.. సీతారామం బ్యూటీ..!!

సీతారామం చిత్రం ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెట్టి అందరిని ఆకట్టుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. హిందీలో పలు సీరియల్స్ ద్వారా సైడ్ యాక్టర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగు పెట్టింది అక్కడ జెర్సీ అనే రీమిక్స్ సినిమాతో హీరోయిన్గా మారిపోయింది. ఊహించని విధంగా తెలుగులో అవకాశం రావడంతో మంచి సక్సెస్ అందుకుంది.మృణాల్ ఠాకూర్ నూర్జహాన్ అలియాస్ సీత పాత్రలో అద్భుతంగా నటించింది. ఈమే నటనతో విమర్శకుల ప్రశంశాలు కూడా అందుకుంది. సీతారామం చిత్రం పెద్ద హిట్ కావడంతో ఇక ఈమెకు అన్ని భాషలలో కూడా అవకాశాలు వెలుపడ్డాయి.

Mrunal Thakur Leaves All Worried As She Drops Her Crying Selfie; Here's Why
బాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలు లభించినట్లుగా తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే తాజాగా న్యాచురల్ స్టార్ నానికి జోడిగా తెలుగులో మరొక సినిమాలో నటించబోతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలయ్యింది. నాగార్జున ప్రసన్నకుమార్ దర్శకత్వంలో నటించబోతున్న ఒక సినిమాలో కూడా ఈమెన సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే వెంకటేష్ నటిస్తున్న సైంధవ సినిమా కోసం కూడా మృణాల్ ఠాకూర్ నే సంప్రదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిత్యం గ్లామర్ ఫోటోలతో తన ఇంస్టాగ్రామ్ లో తెగ సందడి చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

సడన్గా ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ లో కన్నీళ్లు పెట్టుకున్న ఒక ఇమేజ్ ని షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన తర్వాత తమ హీరోయిన్ కి ఏమైందో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా చూడడం జరిగింది. అయితే ఈ ఫోటోపై ఆమె రాసిన వ్యాఖ్యలు అందరిని స్ఫూర్తినిచ్చే విధంగా కనిపిస్తున్నాయి.. నిన్న కష్టంగా అనిపించింది అయితే ఈ రోజు నేను బలంగా తెలివిగా సంతోషంగా ఉన్నాను.. ప్రతి ఒక్కరు కథలో వారికి కొన్ని పేజీలు ఉంటాయి వాటికి దగ్గరగా చదవరు అయితే నేను మాత్రం చదువుతాను ఎందుకంటే నేను నేర్చుకున్న పాఠాన్ని ఇంకెవరైనా నేర్చుకోవాలి అంటూ అంతవరకు బలంగా ధైర్యంగా ఉండటానికి ఈ పాఠం ఉపయోగపడుతుంది అంటూ రాసుకొచ్చింది.