`శాకుంత‌లం` టోట‌ల్ బ‌డ్జెట్ అన్ని కోట్లా.. ఏ ధైర్యంతో పెట్టారు సామీ?

ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెర‌కెక్కించిన చిత్రం `శాకుంత‌లం`. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా పౌరాణిక నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో శ‌కుంత‌ల‌గా స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ను పోషించింది. ఆమెకు జోడీగా దుష్యంత మహారాజు మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ చేశాడు.

మోహన్‌ బాబు, ప్రకాష్‌ రాజ్‌, అనన్య నాగళ్ల, మధుబాల, గౌతమి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ ఎపిక్ ల‌వ్ స్టోరి విజువ‌ల్ వండ‌ర్‌గా త్రీడీ టెక్నాల‌జీతో ఏప్రిల్ 14న తెలుగు, హిందీ, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ పెద్ద ఎత్తున జ‌రుగుతున్నాయి. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్‌.. శాకుంత‌లం టోట‌ల్ బ‌డ్జెట్ ను రివీల్ చేశారు.

ఈ సినిమాకు కోసం మేక‌ర్స్ ఏకంగా రూ. 80 కోట్లు వెచ్చించార‌ట‌. ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న దిల్ రాజు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయినట్లుగా తాజాగా గుణశేఖర్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సినిమా నిర్మాణానికి అయిన 80 కోట్ల బడ్జెట్ లో దిల్ రాజు సగం పెట్టుబడి పెట్టినట్లుగా తెలియజేశారు. మిగిలిన స‌గం తాను పెట్టుకున్న‌ట్లు పేర్కొన్నారు. దీంతో నెటిజ‌న్లు `ఏ ధైర్యంతో అంత బ‌డ్జెట్ పెట్టారు సామీ` అంటూ ఆశ్చర్య‌పోతున్నారు. మ‌రి ఈ సినిమా విడుద‌ల త‌ర్వాత ఏ స్థాయిలో వ‌సూళ్ల‌ను రాబ‌డుతుందో చూడాలి.