ఎట్టకేలకు నరేష్-పవిత్ర లోకేష్ పెళ్లిపై క్లారిటీ వచ్చిందిగా..?

నరేష్ ,పవిత్ర లోకేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. వీరిద్దరూ స్టార్ హీరో హీరోయిన్స్ రేంజ్ లో పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా వీరి పాపులర్ సోషల్ మీడియాని చెప్పవచ్చు. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనే వార్తలు వైరల్ గా మారడంతో మరింత ట్రెండీగా నిలిచారు. ఇక మధ్య లిప్ లాక్ సన్నివేశాలను సైతం షేర్ చేస్తూ మరింత వైరల్ గా మారారు. ఇప్పుడు ఏకంగా మళ్లీ పెళ్లితో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరికీ షాక్ ఇవ్వడం జరిగింది.

ఇక వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇవ్వడంతో వీరిద్దరూ నిజంగానే వివాహం చేసుకున్నారా లేదా అనే విషయంపై అందరికీ సంథింగ్గత నెలకొంది .ఇప్పుడు తాజాగా ఇదంతా కేవలం సినిమా కోసమే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా మళ్లీ పెళ్లి అనే సినిమా టైటిల్ తో ఒక పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. నరేష్ ,పవిత్ర కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఇందులో నరేష్ తల్లి విజయనిర్మల స్థాపించిన విజయకృష్ణ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.

నరేష్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఇప్పటికి 50 సంవత్సరాలు అవుతున్న ఈ సందర్భంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాని తీస్తారు అనుకున్నారు. కానీ మళ్లీ పెళ్లి అని సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్తో నరేష్ పవిత్ర ఇద్దరీతో సినిమా తీస్తూ షాక్ ఇచ్చారు. ఈ పోస్టర్ విషయానికి వస్తే వైట్ కలర్ చూసి వేసుకొని నరేష్ చేతికి స్మార్ట్ వాచ్ ధరించి పవిత్ర వాకిట్లో ముగ్గు వేస్తూ ఉండగా ఆ ముగ్గుని చూస్తూ స్మైలిస్తూ కనిపిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో వీరి పెళ్లిపై క్లారిటీ ఇచ్చారని చెప్పవచ్చు.