ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కొద్ది నెలల క్రితం నాగచైతన్యతో వివాహ బంధాన్ని విడాకులతో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. అన్నిటిని సమంత ధైర్యంగా ఎదుర్కొంది. తన పూర్తి ఫోకస్ ను కెరీర్ పైనే పెట్టి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లను టేకప్ చేసింది. అయితే చైతుతో విడిపోయిన కొద్ది రోజులకే సమంత `పుష్ప` సినిమాలో `ఊ అంటావా..` అనే ఐటెం సాంగ్ చేసి దేశవ్యాప్తంగా ఎంతలా అలజడి సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే ఆ సాంగ్ ఒప్పుకున్న సమయంలో తనకు ఎదురైన అనుభవాలను సమంత పంచుకుంది. తాజాగా `శాకుంతలం` ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. `విడాకులైన కొత్తల్లో పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేసే ఆఫర్ వచ్చింది. దానికి నేను సైన్ చేశాను. ఈ విషయం తెలిసి కుటుంబసభ్యులు, బంధువులు ఐటెం సాంగ్ చేయకంటూ తిట్టారు.
నీకు విడాకులై ఎక్కువ రోజులు కావడం లేదు. అప్పుడే ఐటెం సాంగ్స్ చేయడం బాగోదు అంటూ వారించాడు. ఎప్పుడూ అండంగా ఉండే ఫ్రెండ్స్ కూడా ఆ టైమ్ లో సపోర్ట్ చేయలేదు. అయినాసరే నేను వారి మాటలు వినలేదు. వైవాహిక బంధంలో నేను వంద శాతం నిజాయితీగా ఉన్నాను. అయినా అది వర్కౌట్ కాలేదు. అలాంటప్పుడు నేనేదో నేరం చేసిన దానిలా ఎందుకు ఉండాలి. నేను చెయ్యని నేరానికి నన్ను నేను హింసించుకుని ఎందుకు బాధపడాలి` అంటూ సమంత ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారాయి.