స్టార్ హీరోయిన్ సమంత కొద్ది నెలల క్రితం భర్త నాగచైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత ఎన్నో విమర్శకులు, మరెన్నో అవమానాలు సమంతకు ఎదురయ్యాయి. అయినాసరే వాటిని ఎదురించి కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది. ఇంతలోనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సమంతను కబలించింది. చివరకు దాన్ని సైతం జయింది మళ్లీ సమంత షూటింగ్స్ లో బిజీగా అయింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ `శాకుంతలం` ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటోంది. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత్రాన్నిదర్శకుడు గుణశేఖర్ రూపొందించారు. ఇందులో సమంతకు జోడీగా దుష్యంత మహారాజు పాత్రలో దేవ్ మోహన్ నటించాడు. త్రీడీ ఫార్మేట్లో ఏప్రిల్ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. తన వ్యక్తిగత జీవితం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
`గత రెండేళ్లతో నా లైఫ్ లో ఎన్నో జరిగాయి. కానీ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నా పనే నన్ను మళ్లీ నిలబెట్టింది. ఇప్పటికీ నిలకడగా ఉండే శక్తిని ఇచ్చింది. అందుకే ఏ విషయాన్ని నా పనిని ప్రభావితం చేయనివ్వను. నేను మంచం మీద నుండి లేవలేకపోతే తప్ప. కానీ గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉంది. ఆ టైమ్ లో ఇటు ప్రొడక్షన్ వారు, అటు అభిమానులు నాకెంతో మద్దతిచ్చారు. అదే నన్ను కోలుకునేలా చేసి మళ్లీ షూటింగ్ వెళ్లేలా చేసింది` అంటూ సమంత ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది.