ఎమోషనల్ తో ఆకట్టుకుంటున్న రంగమార్తాండ ట్రైలర్..!!

డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం రంగమార్తాండ. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ,బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ప్రీమియర్ షోకు ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చినట్లుగా తెలుస్తోంది.దీంతో ఉగాది కానుకగా ఈ చిత్రం ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రం కోసం ఎంతోమంది అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇళయరాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందించడం జరిగింది ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

నిన్నటి రోజున సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ముఖ్యంగా ఇందులోని బ్రహ్మానందం డైలాగులు ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి.. ట్రైలర్ చూస్తే కుటుంబంలో జరిగే కొన్ని సంఘటనలను కళ్ళకు కట్టినట్టుగా చూపించినట్లు తెలుస్తోంది కృష్ణవంశీ. ముఖ్యంగా ఎమోషనల్ డైలాగ్స్ సన్నివేశాలు కూడా ఈ చిత్రం పైన మరింత ఆసక్తిని పెంచేలా కనిపిస్తున్నాయి. బ్రహ్మానందం రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు అన్నీ కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి.

జీవితంలో నటనను ప్రాణంగా భావించి ఒక రంగస్థలం కళాకారుడు జీవిత అనుభవాలను గురించి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం.. బ్రహ్మానందం చెప్పే డైలాగ్ ప్రతి ఒక్కరిని గుండెల్లోనే హత్తుకునేలా కనిపిస్తోంది. రాహుల్ సింప్లీ గాని శివాత్మిక రాజశేఖర్ , అనసూయ ఆదర్శ బాలకృష్ణ తదితరులు ఇందులో నటిస్తూ ఉన్నారు. రేపటి రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది చాలా కాలం తర్వాత కృష్ణవంశీ నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.