గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ లో నరేష్-పవిత్రల వ్యవహారం ఎంతటి హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు. గత కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తున్న ఈ జంట.. న్యూ ఇయర్ సందర్భంగా లిప్ లాక్ వీడియోతో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవలే పవిత్రను వివాహం చేసుకున్నట్టు నరేష్ ఓ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
దాంతో ఆ వీడియో బాగా వైరల్ అయింది. అయితే అది నిజం కాదని, ఆ వీడియో సినిమాలోని ఓ సన్నివేశమనే వాదనలు కూడా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో నరేష్పై ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.
ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ అంతా కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. నటుడు నరేష్ పై ఫన్నీ కామెంట్లు చేశారు. నరేష్ తనకు తమ్ముడు లాంటి వారని, ఆయనతో కలసి ఈ సినిమాలో పనిచేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అక్కడితో ఆగలేదు.. నరేష్ కత్తి లాంటి వాడని, నిత్య పెళ్లి కొడుకు అంటూ ఫన్నీ గా పంచ్ లు వేశారు. దీంతో అక్కడ ఉన్నవారంతా తెగ నవ్వుకున్నారు. ఇక నరేష్ గురించి సరిగ్గా చెప్పారంటూ చాలా మంది నెటిజన్లు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.