డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రంగా వచ్చింది పొన్నియన్ సెల్వన్. ఈ చిత్రం మొదటి భాగం విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. ఈ చిత్రంలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష ,శోభిత తదితరులు భారీ తారగడంతో ఈ చిత్రంలో నటించడం జరిగింది. పొన్నియన్ సెల్వన్ అనే పుస్తకమనే ఆధారంగా తమిళ రాజుల చరిత్రను చూపించడం జరిగింది.ఈ సినిమా విడుదలైన మొదటి భాగం భారీ అంచనాల మధ్య విడుదలైన తమిళనాడులో రూ.200 కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇతర భాషలలో అంతంత మాత్రమే ఉన్నది.
తాజాగా అభిమానులు కూడా పొన్నియన్ సెల్వన్-2 చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా ట్రైలర్ నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్లలో విడుదల కాబోతోంది. తాజాగా ట్రైలర్ ఈవెంట్ నిర్వహించిన చిత్ర బృందం ఈవెంట్ కి ఇందులో నటించిన స్టార్స్ అందరితో పాటు పలువురు తమిళ సినీ ప్రముఖులు కూడా విచ్చేయడం జరిగింది.పొన్నియన్ సెల్వన్-1 లో రజనీకాంత్ కమలహాసన్ వచ్చి ఈ సినిమాని ప్రమోట్ చేయడం జరిగింది.తాజాగా పొన్నియన్ సెల్వన్-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కమలహాసన్ మాత్రం ముఖ్యఅతిథిగా రావడం జరిగింది.
ఇక ట్రైలర్లో అన్నీ కూడా యుద్ధాలు ఒకరిపై ఒకరు పన్నాగాలు ఎత్తు ఒక పయెత్తులు చూపించారు.. మరణించారనుకున్న పొన్నియన్ సెల్వన్ ఎలా బయటికి వచ్చారు చోళులు వర్సెస్ పాంజీల కథ ఇలా మొదటి కథకు కొనసాగింపుగానే ఈ చిత్ర ట్రైలర్ చూపించారు. అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటికీ పెద్దగా బజు లేకుండా విడుదలవ్వడంతో ఎవరు పట్టించుకోలేదు. మరి సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.