డైరెక్టర్ గా జబర్దస్త్ కమెడియన్ సక్సెస్ అయ్యారా..!!

జబర్దస్త్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన వారు పలు సినిమాలలో పలు పొజిషన్ లో ఉన్నారని చెప్పవచ్చు. అలా జబర్దస్త్ నుంచి కామెడీయన్ గా మారి ఏన్నో చిత్రాలలో కమెడియన్ గా నటించి ప్రస్తుతం డైరెక్టర్గా మారారు కమెడియన్ వేణు. తాజాగా బలగం అనే సినిమా ద్వారా డైరెక్టర్ గా మారారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణంలో నిర్మించడం జరిగింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమా ప్రీమియర్స్ తోనే హిట్టు టాకు తెచ్చుకుంది.

TrackTollywood on Twitter: "Jabardasth comedian #Venu surprises everyone  with #Balagam : https://t.co/JINNzZlznY" / Twitterఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ బలగం సినిమా వేణు నడిపించిన కథాకథను ప్రేక్షకులను బాగా నేర్పించాయి. దీంతో ప్రతి ఒక్కరూ కూడా చూడవలసిన సినిమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ సినిమా హిట్ అవ్వడంతో వేణుకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బలగం చిత్రం హిట్టకు రావడమే ఆలస్యం అనగా ఆ వెంటనే సెకండ్ సినిమాను కూడా దిల్ రాజు బ్యానర్ లోనే తీసేయాలా అడ్వాన్స్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

వివాదంగా మారుతున్న దిల్ రాజు 'బలగం' .. 2014లో వచ్చిన 'పచ్చికి' కథని 90 శాతం  కాపీ ?
దిల్ రాజు మరొకసారి తన ప్రొడక్షన్ సత్తా ఏంటో బలగం సినిమాతో చూపించారు. వేణుకి దిల్ రాజు సెకండ్ అవకాశం ఇచ్చారంటే అది మామూలు విషయం కాదని చెప్పవచ్చు. మరి వేణు తన సెకండ్ డైరెక్షన్లో ఎలాంటి సినిమాలు తెరకెక్కిస్తారని అభిమానులు సైతం తెగ ఆతృతంగా ఎదురుచూస్తున్నారు. దీంతో వేణు కూడా డైరెక్టర్ గా సక్సెస్ అయ్యారని ఆయన అభిమానుల సైతం భావిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో టాప్ డైరెక్టర్ గా పేరు సంపాదిస్తారేమో చూడాలి మరి.