బాలయ్య నటించి వీర సింహారెడ్డి సినిమా ద్వారా అందరికీ పాపులర్ అయ్యింది హీరోయిన్ హనీ రోజ్.. ఇమే తాజాగా హైదరాబాదులో ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మదీనాగూడలో కొత్తగా జిస్మాత్ జైలు పేరుతో ఏర్పాటు చేసిన ఈ హోటల్ కు ఓపెనింగ్ ఈవెంట్ కి ఈమె గెస్ట్ గా రావడం జరిగింది. హానీ రోజ్ ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వస్తుందని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆమెను చూడడానికి అభిమానుల సైతం ఎగబడ్డారు. ఆ తర్వాత హనీ రోజ్ మీడియా ముందర మాట్లాడడం జరిగింది.
వీర సింహారెడ్డిలో తన పాత్రకు మంచి గుర్తింపు వచ్చిందని తెలుగు ప్రేక్షకులు కూడా తనను బాగా ఆదరిస్తున్నారని బాలకృష్ణ వంటి లెజెండ్ నటలతో నటించే అవకాశం రావడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది..నేను రెండు విభిన్నమైన పాత్రలు చేశాను అందుకోసం చాలా కష్టపడ్డాను డైరెక్టర్ గోపీచంద్ మల్లి నేను ఫోన్ చేసి తన పాత్ర గురించి వివరించారు.
ఇక షూటింగ్ సమయంలో బాలయ్య గారు తనకి సలహాలు ఇచ్చారని తెలిపింది. తనకు నటన అంటే చిన్న వయసు నుంచి ఇష్టం ఉండడంతో 2005వ సంవత్సరంలో ఇండస్ట్రీలోకి వచ్చాను.
తనకు సినిమాలు చేయడం తప్ప మరొక పనిలేదని తెలిపింది. తను ఎక్కువగా కేరళ ఫుడ్ ఎక్కువగా ఇష్టమని అలాగే హైదరాబాద్ బిర్యానీ పెరుగు అన్నం అంటే చాలా ఇష్టమని తెలిపింది.ఇక పెళ్లి అనేది ఒక బాధ్యత.. వాటి జోలికి ఇప్పుడప్పుడే వెళ్ళనంటూ తెలుపుతోంది..అందుచేతనే నేను ప్రతి విషయాన్ని ప్రేమిస్తాను అంతవరకే వెళ్తానంటూ తెలియజేసింది ఇక సోషల్ మీడియాలో మంచి చెడులు అనేవి రెండు ఉంటాయి.. అందుకే వాటిని అసలు పట్టించుకోను అంటూ తెలుపుతోంది హనీ రోజ్.