మన్మధుడు ఈజ్ బ్యాక్‌.. నాగ్ తాజా లుక్ చూసి పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్‌!

గ‌త ఏడాది `ది ఘోస్ట్` పరాజయం తర్వాత అక్కినేని మ‌న్మ‌ధుడు నాగార్జున మ‌ళ్లీ వెండితెర‌పై క‌నిపించ‌లేదు. సోష‌ల్ మీడియాలో సైలెంట్ అయ్యారు. ఆయ‌న నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా రాలేదు. అయితే నాగార్జున‌ త‌న త‌దుప‌రి సినిమాను ధ‌మాకా ర‌చ‌యిత‌ ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ‌తో చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ చిత్రంతోనే సినీ పరిశ్రమకు ప్ర‌స‌న్న‌కుమార్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మాస్ యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ మూవీ తెర‌కెక్క‌బోతోంది. ఇందులో నాగార్జునతో పాటు అల్ల‌రి న‌రేష్ మ‌రో హీరోగా క‌నిపించ‌బోతున్నాడ‌ని టాక్ న‌డుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఇదిలా ఉంటే.. నాగా తాజా లుక్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.

చాలా రోజుల తర్వాత నాగార్జున స్టైలీష్ అండ్ ఛార్మింగ్ లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చారు. బ్లూషర్ట్ లో స‌రికొత్త హెయిర్ స్టైల్‌, గ‌డ్డంతో క‌నిపించి అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. నాగ్ తాజా లుక్ చూసిన అక్కినేని అభిమానులు `మ‌న్మ‌ధుడు ఈజ్ బ్యాక్` అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి నాగ్‌ లేటెస్ట్ లుక్ ఆయ‌న త‌దుప‌రి సినిమా కోస‌మేనా..? లేదా ఏదైనా యాడ్ షూట్ కోస‌మా..? అన్న‌ది చూడాలి.