అల్లు అర్జున్ – రామ్ చరణ్ మధ్య గొడవలు.. అసలు విషయం ఇదే

ప్రతి హీరోకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా తెలుగులో ఫ్యాన్స్ వార్ బాగా ఎక్కువగా ఉంటోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో పెద్ద సంఖ్యలో హీరోలు ఉన్నారు. వారిలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా చాంతాడంత జాబితా ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్, రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్లుగా వెలుగొందుతున్నారు. అల్లు అర్జున్ తన కెరీర్‌ను 2003లో ప్రారంభించగా, రామ్ చరణ్ 2007లో చిరుత సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అంతా మెగా ఫ్యాన్స్ అయినప్పటికీ మెగా హీరోలలో ఎవరికి వారే ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నారు. ఇటీవల కాలంలో అల్లు అర్జున్ తాను మెగా కాంపౌండ్ నుంచి బయటపడి, సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీనిని కొందరు తప్పుగా చిత్రీకరిస్తూ, వారి ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని పేర్కొంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ చిత్ర బృందానికి అల్లు అర్జున్ ఒక రోజు లేట్ గా ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపాడు. దీనిపై చరణ్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఒకరోజు లేట్ గా విషయం తెలిసిందా అంటూ కామెంట్లు పెట్టారు. ఇటీవల రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ లో విషెష్ చెప్పలేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే రామ్ చరణ్ కు అల్లు అర్జున్ నేరుగా ఫోన్ చేసి విషెష్ చెప్పాడని తెలుస్తోంది.


అయితే సోషల్ మీడియాలో ఎలాంటి విషెస్ పెట్టకపోవడంతో అల్లు అర్జున్ పై వారంతా మండిపడుతున్నారు. అయితే ఇలా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వార్ కొత్తదేమీ కాదు. తామంతా కలిసే ఉంటామని, ఫ్యాన్స్ కూడా గొడవలు పడకుండా కలిసి ఉండాలని సినిమా హీరోలు పలు సందర్భాల్లో చెప్పారు. అయితే ఫ్యాన్స్ మాత్రం తమ హీరో గొప్ప అంటూనే ఇతరులపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు.