బాలీవుడ్లో పలు సినిమాలతో బిజీగా ఉంటున్న సెలబ్రిటీలలో దీపికా పదుకొనే-రణబీర్ సింగ్ కూడా ఒకరు.. వీరిద్దరికి వివాహమైన పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా బాలీవుడ్లో ఆదర్శ దంపతులుగా కూడా పేరు సంపాదించారు.ఎలాంటి వేదికైనా సరే జంటగా హాజరవుతూ కనిపిస్తూ ఉంటారు. ఏ ఈవెంట్ కి హాజరైన సరే దంపతులు చాలా సంథింగ్ స్పెషల్ అన్నట్లుగా ఉంటారని బాలీవుడ్ మీడియాలో కథలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీరిద్దరూ కారు దిగుగానే చేతులు కలుపుకొని నవ్వుతూ కెమెరాలకు ఫోజులిస్తూ ఉంటారు. అక్కడే స్పెషల్ షూట్ ఏర్పాటు ఏదైనా ఉంటే కలిసి హడావిడి చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది.
కానీ తాజాగా ముంబైలో జరిగిన ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ నాలుగో ఎడిషన్ ఈవెంట్లో ఇవన్నీ మిస్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకకు ఇద్దరు జంటగానే హాజరయ్యారు కానీ ముందుగా రణవీర్ కారులో నుంచి దిగి బయటకి రాగ దీపికా కోసం వెయిట్ చేస్తున్నారు. దీపిక చేయి అందిస్తే జంటగా లోపలికి వెళ్లాలనుకున్నారు రణవీర్.. కానీ అక్కడ దీపిక పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. రణబీర్ చేయి చాచిన అస్సలు పట్టించుకోకుండా తానే స్వయంగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఆ వెంటనే రణబీర్ కూడా లోపలికి వెళ్లడం మనం ఈ వీడియోలో గమనించవచ్చు.
ఇక ఎవరికి వారు లోపలికి వెళ్ళిపోయారు. ముఖ్యంగా దీపిక పదుకొనే.. తీరు పలు ప్రశ్నలకు దారి తీసేలా కనిపిస్తోంది. రణవీర్ సరదాగా కనిపించిన దీపికా మొత్తం చాలా సీరియస్ గానే కనిపిస్తున్నది. దీంతో నెటిజన్లు వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది దీపిక తన చర్య ద్వారా రణవీరును అగౌరవపరుస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వీడియో పైన క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.
View this post on Instagram