హీరోయిన్ సౌందర్య జీవితంలో ఎవరికి తెలియని మరో పేజీ ఉందా.. బయటపడ్డ షాకింగ్ నిజం..!?

మహానటి సావిత్రి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నటి సౌందర్య. అందంతోపాటు అభినయంతో కూడిన నటన కలిగిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో సౌందర్య కూడా ఒకరు. ఆమె మరణించి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ మనం ఆమెను మర్చిపోలేక పోతున్నాం. ఆమె నటించిన అద్భుతమైన పాత్రలు అలాంటివి మరి.

Actress Soundarya had said that it would be her last film: Udaykumar's revelation - CINEMA - CINE NEWS | Kerala Kaumudi Online

సౌత్ చిత్ర పరిశ్రమలోనే దాదాపు అగ్ర హీరోల అందరితో నటించి ఏ హీరో కైనా మేడ్ ఫర్ ఈచ్ అథర్ లాగా తన హావభావాలతో ఆకట్టుకుంది. సౌందర్య సినిమాల విషయం పక్కనపడితే ఈమె తన చిన్ననాటి స్నేహితుడైన రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరిద్దరి పెళ్ళికి ఆ రోజుల్లో సౌత్ పరిశ్రమలో ఉన్న ఆగ్ర హీరోలు మరియు బంధుమిత్రుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఇప్పటికీ వీరి పెళ్లి ఫోటోలు వీడియోలు మనం సోష‌ల్‌ మీడియాలో చూస్తూనే ఉన్నాం. వీరిద్దరిపెళ్ళి 2003వ సంవత్సరంలో జరిగింది.. అదే సంవత్సరం సౌందర్య ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.

సౌందర్యకి తన భర్త రఘు అంటే ఎంతో ఇష్టం, ఈమె తన సంపాదించిన ఆస్తులు అన్నీ కూడా అతని పేరు మీదనే రాసింది. ఇక సౌందర్య మరణించిన తర్వాత ఈ ఆస్తుల విషయంలో రఘు కి సౌందర్య తల్లిదండ్రుల మధ్య ఎన్నో గొడవలు కూడా జరిగాయి. అయితే ప్రస్తుతం ఆయన రెండో వివాహం చేసుకొని గోవాలో నివసిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే సౌందర్య మరణించే ముందు గర్భం దాల్చిందని.. ఆమెకి అప్పటికే ఓ బిడ్డ కూడా పుట్టాడు అంటూ ఆ సమయంలో ఎన్నో వార్తలు కూడా వచ్చాయి.

Biopic on late actor Soundarya in the works; Social media is rife with reports on the same | Telugu Movie News - Times of India

అంతకు ముందే ఆమె ఒక బిడ్డకి జన్మ ఇచ్చిందని, ప్రస్తుతం ఆ బాబు రఘు వద్దే పెరుగుతున్నాడు అంటూ ఇలా పలు రకాల వార్తలు ఎన్నో వ‌చ్చాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సౌందర్య సన్నిహితులు ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. సౌందర్య పెళ్ళైన రెండేళ్ల వరకు పిల్లల్ని కనకూడదు అని అనుకుందని, సోషల్ మీడియా లో వస్తున్న వార్తల్ని నమోద్దు అంటూ ఈ సందర్భంగా తెలిపారు.