ఆది పురష్ సినిమా రిలీజ్ డేట్ లాక్..!!

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రంగా పేరు పొందింది ఆది పురష్ చిత్రం. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ నటిస్తూ ఉండగా హీరోయిన్గా కృతి సనన్ నటిస్తున్నది. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న గ్రాఫిక్స్ పరంగా విమర్శలు పొందింది.దీంతో డైరెక్టర్ ఓం రౌత్ రీ గ్రాఫిక్స్ చేసే పనిలో పడ్డారు. దీంతో ఈ సినిమా ఆలస్యం అవుతుందని వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ పై క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం వాటి గురించి తెలుసుకుందాం.

Adipurush teaser: Prabhas' Lord Ram gets ready to battle Saif Ali Khan's  Lankesh in a jerky CGI fest | Entertainment News,The Indian Express
గత ఏడాది విడుదలైన టీజర్ తో అందరికీ షాక్ ఇచ్చింది అది పురుష్ చిత్రం బృందం. దీంతో డైరెక్టర్ ఈ సినిమా కోసం మరొక రూ .100 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గ్రాఫిక్స్ మళ్లీ రీ డిజైన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆది పురుష్ రిలీజ్ మరింత ఆలస్యం అవుతుందని వార్తలుగా మారాయి. దీంతో రంగంలోకి దిగిన చిత్ర బృందం తమ సినిమా అని సంక్రాంతికి కాకుండా వచ్చే ఏడాది జూన్ 16వ తేదీన విడుదల చేయాలని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.

ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది ..తాజాగా ఈ సినిమా గురించి ఈ క్రేజీ న్యూస్ బయటకు రావడంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడుతున్నారు. కానీ శ్రీరామనవమి సందర్భంగా వరుస అప్డేట్లు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది మార్చి 30 నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ఇవ్వబోతున్నట్లు సమాచారం దీంతో అభిమానులు కాస్త ఖుషి గా ఫీల్ అవుతున్నారు.