స్టార్ట్ హీరో శరత్ కుమార్ నట వారసురాలిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్. ఆమె బ్యాక్గ్రౌండ్ పెద్దది కాబట్టి ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతుందని అందరూ అనుకుంటారు. కానీ ఆమె హీరోయిన్గా కంటే విలన్గా ఎక్కువ గుర్తింపు సంపాదించుకుంది. దర్శకులు ఎవరైనా వారి సినిమాలో లేడీ విలన్ పాత్ర రాసుకుంటే వారికి మొదటిగా గుర్తొచ్చే నటి వరలక్ష్మి శరత్ కుమార్ అంటే అతిశయోక్తి కాదు. నెగిటివ్ రోల్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్కి అంత మంచి పట్టు ఉంది.
స్టార్ హీరోలను కూడా తలదన్నే పవర్ఫుల్ పాత్రలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలో విలన్ పాత్రలో నటిస్తుంది. అందరినీ మెప్పిస్తుంది. అంతేకాకుండా తన సినిమాలకు సంబంధించిన అన్ని అప్డేట్స్ని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు అక్కడికంటే ఎక్కువగా టాలీవుడ్లోనే అవకాశాలు దక్కించుకుంటుంది. ఇటీవలే వరలక్ష్మి శరత్ కుమార్ మట్లాడుతూ కోలీవుడ్ ఇండస్ట్రీ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె లాంటి టాలెంట్ ఉన్న ఎంతోమంది ఆర్టిస్టులకు తమిళ ఇండస్ట్రీలో సరైన గుర్తింపు దక్కడం లేదు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెని మంచి గుర్తింపు వచ్చిందని వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పుకొచ్చింది. ఇక త్వరలోనే హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వబోతున్నానంటూ ఆమె మనసులోని మాట చెప్పింది. ఈ మాటలు విన్న చాలా మంది ఆశ్చర్యపోతున్నారు కోలీవుడ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.