భర్తను పచ్చిగా తిట్టిన యాక్ట్రెస్.. చివరికి 600 ఎకరాలు కోల్పోయింది..!

 

టాలీవుడ్ నటి కాకినాడ శ్యామల మనందరికీ సుపరిచితురాలే. తెలుగు, తమిళ భాషలలో ఆమె దాదాపు 200 పైగా సినిమాలో నటించింది. ఇటీవలే ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. కాకినాడ శ్యామల మాట్లాడుతూ ‘కృష్ణంరాజు గారితో ‘నిత్య సుమంగళి’ అనే సినిమాలో చేసానని’ తెలిపారు. కాకినాడ శ్యామల కృష్ణంరాజుతో నటించిన ఇంకో సినిమా ‘పచ్చబొట్టు’ లో డ్యూయల్ లో నటించారట. ఆ టైమ్‌లో లక్ష రూపాయలు పోయాయని ఆమె చెప్పారు.

కమల్ హాసన్ హీరోగా నటించిన ‘మరో చరిత్ర’ సినిమాలో కాకినాడ శ్యామల కమల్‌కి తల్లి పాత్రలో నటించారు. మొదట ఆమెని గయ్యాళి పాత్రకోసం పరిశీలించారట కానీ తల్లి పాత్రకి ఎంచున్నారని ఆమె తెలిపారు. నిజానికి శ్యామల పాటలు పడాలనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పారు. శ్యామల భర్త వాళ్ల తండ్రికి 600 ఎకరాల భూమి ఉండేదని దాంట్లో 120 ఎకరాల భూమి ఆమె భర్తకి వచ్చిందని వివరించారు.

అయితే శ్యామల భర్త పెద్ద రసికుడని, 600 ఎకరాల భూమిని 38 ఎకరాలకు తీసుకొచ్చాడని.. దాంతో ఆమె తన భర్తతో ‘మగాడు అంటే భార్య పిల్లల కోసం డబ్బు సంపాదించి వారిని సుఖపెట్టాలి ,అలాంటి మగాడిని నేను ఇష్టపడతాను, నా దృష్టిలో నువ్వు అసలు మగాడివే కాదు’ అని అన్నానని చెప్పారు. అయితే 63 ఏళ్ల వయసులో శ్యామల భర్త మరణించారట. మద్రాస్‌లో ఉన్నపుడు ఆయన ఎక్కువగా క్లబ్ లోనే ఉండేవారని, అవే ఆస్తులు ఇప్పుడు ఉంది ఉంటే కోట్ల రూపాయలు విలువచేసేవని కాకినాడ శ్యామల కామెంట్స్ చేసారు. ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.