వాలెంటైన్స్ డే కి గుండెల్లో రాడ్… సుధీర్ పేరు చెప్పగానే కన్నీళ్లతో వెళ్లిపోయిన ర‌ష్మీ..!

బుల్లితెర రోమియో జూలియట్ సుధీర్- రష్మీ జంట ఎంతటి క్రేజ్ ను దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి చేసిన షోలో ఎంత సక్సెస్ అయ్యాయో అంతకంటే ఎక్కువ వీరిద్దరూ పాపులారిటీ దక్కించుకున్నారు. కాగా ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ జోడి విడిపోయినట్టు తెలుస్తుంది. దానికి కారణం రీసెంట్గా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో.. ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ షో ప్రతి ఆదివారం ఎంతో సరికొత్త కాన్సెప్ట్ వచ్చి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

సరికొత్తగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ'షో..

కాగా రీసెంట్ గా వచ్చిన ఈ ప్రోమోలో రష్మీ బిహేవియర్ చూసి నెటిజన్లు సుధీర్ అభిమానులు కూడా ఒకంత ఫీల్ అయ్యారు. వాలంటైన్స్ డే సందర్భంగా రాబోతున్న ఈ షో రీసెంట్ గా వచ్చిన ప్రోమోలో ఆది ప్రేమ గురించి చెబుతూ.. ప్రేమంటే గెలవటం కాదని గెలవడం అని అనడంతో అక్కడ అంతా నవ్వులు పూసాయి. వాలెంటైన్స్ డే కాబట్టి ఈరోజు ఒకరికి గట్టిగా నేను ఒకటి ఇవ్వాలని అనుకుంటున్నాను అని రష్మి అనగానే హైపర్ ఆది నాకు ఇచ్చేయండి.. ఇవ్వాలనుకునే వ్యక్తికి నేను ఇచ్చేస్తా అని అంటాడు.

Rashmi Gautham

హైపర్ ఆది నీ బాబుకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా.. లేదా మీ బాబుకి గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్లేదు గాని ఏదో ఒక రోజు ఓ బుల్లి బాబుని ఇవ్వటం లాంటిది మాత్రం చెయ్యకు అంటూ హైపర్ ఆది కామెంట్ చేస్తాడు. ఈ సందర్భంలోనూ హైపర్ ఆది, రష్మీ నీ పేరుతో ఫ్లేమ్స్ ఎవరితో చూడను అంటూ సుధీర్ నిక్ నేమ్ అయినా సిద్దు అని రాస్తానని పేరు రాయపోతుండగా.. ఆ పేరుతో నా పేరు రాయవ‌ద్దు అంటూ రేష్మి ఆ పేపర్లను చించేయడంతోటు ఒక్కసారిగా ఎమోషనల్ గా మారిపోతుంది.

sujatha rakesh

హైపర్ ఆది బ్రేకప్ అంటూ ఓ బాంబ్‌ కూడా పెలుస్తాడు. ఇప్పటికే యూట్యూబ్లో ఈ ప్రోమో భారీ వ్యూస్ ను దక్కించుకుంటూ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. సుధీర్- రష్మితో బ్రేకప్ చెప్పడం వల్లే రష్మీ ఇంతలా అక్కడ బాధపడింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కూడా వస్తున్నాయి. లేదంటే ఎందుకు తన పేరు ప్రక్కన సుధీర్ పేరు రాయడానికి ఎందుకు ఒప్పుకోదు అని మరో వాదన కూడాా వినిపిస్తుంది.

అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే వచ్చే ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. అయితే వీరిద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని వారి అభిమానులు ఎంతో ఆశపడుతున్నారు. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.