టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `శాకుంతలం`. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటించాడు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ కోసం సమంత ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో శాకుంతలం విడుదల వాయిదా అంటూ మేకర్స్ ప్రకటించడం అభిమానులను తీవ్ర కలవరపాటుకు గురి చేసింది.
శాకుంతలం ఈ నెల 17న థియేటర్లకు రావడం లేదని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తామని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. అయితే వాయిదా వేయడానికి కారణాన్ని మాత్రం తెలపలేదు. ఇక శాకుంతలం విడుదల పోస్ట్ పోన్ అవ్వడంతో సమంత ఫ్యాన్స్ చిత్ర యూనిట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.