తనకు ఎప్పుడో పెళ్లి అయిపోయిందంటూ టాప్ సీక్రెట్ ను రివిల్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. పూర్తి వివరాల్లోకి వెళితే.. సాయి ధరమ్ తేజ్ తాజాగా `వినరో భాగ్యము విష్ణుకథ` సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరు అయ్యాడు. ఇందులో కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా నటించారు. మురళీ కిషోర్ దర్శకత్వం వహించాడు.
జిఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 17న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. మంగళవారం ఈ మూవీ ట్రైలర్ ను సాయిధరమ్ తేజ లాంఛ్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపాడు. ఈ క్రమంలోనే అభిమానులు `అన్నా పెళ్లెప్పుడు..?` అంటూ గోల గోల చేశారు. దాంతో సాయిధరమ్ తేజ్ ఇచ్చిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
`మీరు ఎప్పుడైతే అమ్మాయిలు గౌరవిస్తారో అప్పుడే నా పెళ్లి అవుద్ది` అంటూ సాయి ధరమ్ తేజ్ మొదటి సమాధానం ఇచ్చాడు. దాంతో కొందరు అభిమానులు పిల్లను చూడమంటారా..? అంటూ మళ్లీ ప్రశ్నించగా.. సాయి ధరమ్ తేజ్ `మీరు ముందు అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. అయినా నా పెళ్లి ఎప్పుడు అయిపోయింది. నాలుగు సార్లు అయింది పెళ్లి` అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తేజ సరదాగా ఈ మాటలు అన్న.. నెట్టింట మాత్రం ఆయన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.