సలోని.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. `ధన 51`తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఒక ఊరిలో, చుక్కల్లో చంద్రుడు, కోకిల, బాస్, మగధీర తదితర చిత్రాల్లో నటించింది.
అయితే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `మర్యాద రామన్న` మూవీతో సలోని మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇందులో సునీల్ హీరోగా నటించాడు. 2010లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఇక తెలుగుతో పాటు తమిళ్, కన్నడ భాషల్లోనూ నటించిన సలోని.. గత ఏడేళ్ల నుంచి వెండితెరకు దూరంగా ఉంటోంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించి కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఈ పిక్స్ చూసిన నెటిజన్లు `వార్నీ సలోని ఏంటి ఇలా మారిపోయింది..?` అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే, తాజా పిక్స్ చూస్తే సలోనీని గుర్తు పట్టడం కష్టమే.
సలోని ముఖంలో ఒకప్పటి కళ లేదు. షేపౌట్ అయినట్టు కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ సలోని లేటెస్ట్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.