ఎన్‌బీకే 109.. ఆ ముగ్గురిలో బాల‌య్య ఓటు ఎవ‌రికి..?

చాలా కాలం తర్వాత ఆఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నట‌సింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని ఇటీవల సెట్స్‌ మీదకు తీసుకెళ్లారు. ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది.

తండ్రి కూతురు మధ్య మీ మూవీ కథ‌ సాగుతుంది. ఇందులో బాలయ్య కూతురుగా యంగ్ బ్యూటీ శ్రీ‌లీల క‌నిపించ‌బోతోంది. ఇక‌పోతే బాలయ్య 109వ చిత్రం ఏ దర్శకుడితో ఉండబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. బాలయ్యతో సినిమా చేయడానికి ముందుగా డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ఆసక్తిగా ఉన్నారట. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో `పైసా వసుల్` లాంటి డిఫరెంట్ సినిమా వ‌చ్చింది.

ఇక ఇప్పుడు మరోసారి బాలయ్యతో వ‌ర్క్ చేయడానికి పూరి క‌థ రెడీ చేశాడ‌ని టాక్ న‌డుస్తోంది. అలాగే బోయపాటి దర్శకత్వంలో కూడా సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇది అఖండ సినిమాకు సీక్వెల్ అని అంటున్నారు. వీరితో పాటు బాలయ్యతో `గౌతమి పుత్ర శాతకర్ణి` సినిమా చేసిన క్రిష్ కూడా ఓ క‌థ‌ను రెడీ చేశాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ ముగ్గురిలో ఒక‌రు `ఎన్‌బీకే 109` ప్రాజెక్ట్ కి ద‌ర్శ‌కుడిగా ఫైన‌ల్ కాబోతున్నారు. మ‌రి ఈ ముగ్గురిలో బాల‌య్య ఓటు ఎవ‌రికి ప‌డుతుందో చూడాలి.