లోకేష్ టీజింగ్..రోజానే టార్గెట్ చేశారే!

నారా లోకేష్ పాదయాత్రతో దూకుడుగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర స్థాయిలో పాదయాత్రకు అంత హైప్ రాలేదు గాని..స్థానికంగా మాత్రం బాగానే హైలైట్ అవుతుంది. పాదయాత్ర ఎక్కడ జరిగితే ఆ ప్రాంతం వరకు స్పందన బాగానే వస్తుంది. అదే సమయంలో లోకేష్ గతానికి భిన్నంగా ప్రత్యర్ధులపై పంచ్‌లు పేలుస్తున్నారు. ఇక ఎక్కడక్కడ ప్రజలని కలుస్తూ వారి సమస్యలని తెలుసుకుంటున్నారు.

వైసీపీ హయాంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తాము అధికారంలోకి రాగానే వాటిని తొలగిస్తామని హామీ ఇస్తున్నారు. అలాగే వర్గాల వారీగా ప్రజలతో భేటీ అవుతూ..వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అదే సమయంలో ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే..అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల అక్రమాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. ఇటీవల చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, అటు గంగాధర నెల్లూరులో మంత్రి నారాయణస్వామిపై అవినీతి ఆరోపణలు చేశారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. ఇదే సమయంలో నగరిలో పాదయాత్ర చేస్తున్న లోకేష్..తాజాగా మంత్రి రోజాపై సెటైర్లు పేల్చారు.

చిత్తూరు జిల్లాలో సైకో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి పోటీగా నగరి ఎమ్మెల్యే డైమండ్‌ పాప తయారైందని, డైమండ్‌ పాప అన్నానని మొన్న బాగా ఫీల్‌ అయిందంట. లోకేశ్‌ నన్ను పాప అంటాడా..? అని.. మీ కోరిక మేరకు ఇకనుంచి జబర్దస్త్‌ ఆంటీ అని పిలుస్తా” అని సెటైర్ వేశారు. నగరికి రాకముందు ఆమె పరిస్థితి ఏమిటి? వచ్చిన తర్వాత ఆమె పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏమిటి? అన్నది ఒకసారి ఆలోచించాలని అన్నారు.

విజయపురం మండలంలో శ్రీహరిపురం, కోసలనగరం, పాత ఆర్కాడ్‌ గ్రామాల్లో జబర్దస్త్‌ ఆంటీ డైరెక్షన్‌లో గ్రావెల్‌ యమస్పీడుగా తోడేస్తున్నారని ఆరోపించారు. ఇలా వరుసపెట్టి రోజాని టార్గెట్ చేసి లోకేష్ ఆరోపణలు చేశారు.