బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవలె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. `షేర్షా` మూవీతో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో.. పెద్దలను ఒప్పించి ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.
జనవరి 12న వీరి వెడ్డింగ్ రిసెప్షన్ ముంబైలో అత్యంత ఘనంగా జరిగింది. ఇకపోతే కియారా సిద్ధార్థ్ కంటే ముందే కొంత మందితో లవ్ ఎఫైర్ నడిపించింది. ఈ లిస్ట్ లో మొదట వినిపించే పేరు మోహిత్ మోర్వ. ఇతడితో 2014లో విడుదలైన `ఫగ్లీ` మూవీలో కియారా నటించింది. అయితే మోహిత్ తో కియారా లవ్ పడిందని, వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది.
ఆ తర్వాత `మెషిన్` మూవీలో తనకు జోడీగా నటించిన ముస్తఫా బర్మావాలాతో కియారా లవ్ ఎఫైర్ నడిపించిందంటూ బాలీవుడ్ మీడియా కోడే కూసింది. ఇక బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ దావన్, కియారా ప్రేమలో పడ్డారని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలను వీరిద్దరూ ఖండించారు. ఎంత మందితో లవ్ ఎఫైర్ నడిపించినా ఫైనల్ గా సిద్ధార్థ్ తో కియారా ఏడడుగులు వేసింది.