యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రతిభ ఉన్న హీరోలలో ఒకరని చెప్పవచ్చు. యంగ్ జనరేషన్ హీరోలు సైతం ఈయన యాక్టింగ్ కు స్కిల్స్కు ఫిదా అవుతూ ఉంటారని చెప్పవచ్చు. ఎన్నో వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఎన్టీఆర్ కెరియర్ ఒక్కసారిగా తన పట్టుదలతో సక్సెస్ సాధించి మళ్లీ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ప్రపంచ స్థాయిలో పేరు పొందారు ఎన్టీఆర్. తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ ప్రమోషన్లలో భాగంగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
కిరణ్ అబ్బవరం నేటిజన్ల తో ముచ్చటిస్తూ ఎన్టీఆర్ మాడ్యులేషన్ అంటే తనకు చాలా ఇష్టమని కామెంట్లు చేశారు.జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలని కోరగా మాడ్యులేషన్ గురించి కిరణ్ అబ్బవరం ఈ విధంగా కామెంట్లు చేశారు.. రవితేజ హీరోగా నటించిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, విక్రమార్కుడు సినిమాలు అంటే చాలా ఇష్టమని తెలిపారు కిరణ్ అబ్బవరం. రాను రాను సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టి కిరణ్ అబ్బవరం ఎస్ఆర్ కళ్యాణమండపంతో సక్సెస్ అందుకున్నారు.
ఇక సమ్మతమే సినిమాతో మరో సక్సెస్ ని కూడా అందుకున్నప్పటికీ కిరణ్ అబ్బవరం వరుసగా ప్రముఖ బ్యానర్లు నటిస్తూ మంచి పాపులారిటీ అందుకున్నారు. వినరో భాగ్యము విష్ణు కథ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని తెలిపారు. గత సినిమాలు ఆశించిన ఫలితాలని అందుకొని నేపథ్యంలో కిరణ్ అబ్బవరం కథలు విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఈనెల 17వ తేదీన థియేటర్లు విడుదల కాబోతోంది ఈ చిత్రం ట్రైలర్ను సాయి ధరంతేజ్ తో విడుదల చేయబోతున్నారు.