కియారా-సిద్ధార్థ్ పెళ్లి బ‌డ్జెట్ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు.. ఎన్ని కోట్లు అంటే..?

`షేర్షా` సినిమాలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న బాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హోత్రా నేడు పెళ్లి బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. చాలాకాలం డేటింగ్ లో ఉన్న వీళ్ళిద్దరూ ఎట్టకేలకు పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యారు. రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగ్రహ్‌ ప్యాలెస్ లో పంజాబీ సంప్రదాయం ప్ర‌కారం కియారా-సిద్ధార్థ్ పెళ్లి జరగనుంది.

 

అయితే ఇప్పుడు వీరి పెళ్లి బ‌డ్జెట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ముంబైకి చెందిన ఓ వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ ఆధ్వర్యంలో కియారా-సిద్ధార్థ్ పెళ్లి వేడుకలు గ‌త మూడు రోజుల నుంచి ఘనంగా జ‌రుగుతున్నాయి. వీరి వెడ్డింగ్ బ‌డ్జెట్ తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు. ఎందుకంటే, బీటౌన్ లో జ‌రుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం.. కియారా-సిద్ధార్థ్ త‌మ పెళ్లి కోసం ఏకంగా రూ. 15 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నార‌ని తెలుస్తోంది.

 

అత్యంత వైభవంగా జరగబోతున్న వీరి వివాహానికి సినీ తారలతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరవుతుండటంతో ఖర్చుకు ఏమాత్రం వెనకాడటం లేదని తెలుస్తోంది. ఇప్పటికే సెలెబ్రిటీలంతా జైసల్మేర్ కి చేరుకున్నారు. వీరికోసం సూర్యగఢ్ ప్యాలెస్ లో 70 ప్లస్ రూమ్ లను బుక్ చేశారట‌. అలాగే 70కి పైగా లగ్జీ కార్లను కూడా అతిథుల కోసం అందుబాటులో ఉంచార‌ట‌. కియారా-సిద్ధార్థ్ వెడ్డింగ్ మెనూలో ప్రపంచవ్యాప్తంగా 10 దేశాల నుంచి 100వంటకాలను హోస్ట్ చేస్తున్నట్లు కొన్ని నివేదికలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.