నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం `అమిగోస్`. ఈ మూవీ మరో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తే.. కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశాడు.
ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యేందుకు ఈ చిత్రం ముస్తాబవుతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశారు. ఇకపోతే `ధర్మ క్షేత్రం`లో బాలకృష్ణ, దివ్య భారతిపై తెరకెక్కించిన `ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా` సాంగ్ ను `అమిగోస్` సినిమాలో రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆల్రెడీ బయటకు వచ్చి అదిరిపోయే రెస్పాన్స్ ను అందుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్.. `ఎన్నో రాత్రులొస్తాయి` సాంగ్ షూట్ అనుభవాలను పంచుకున్నాడు.
`ఎన్నో రాత్రులొస్తాయి పాట కోసం షర్టు తీయాలన్నారు.. అవసరం లేదండి అని చెబుతున్నా వినిపించుకోలేదు. ఆ పాటలో ఫిట్ నెస్ ఇంకా బాగా కనిపించాలని ఎక్కువగా కసరత్తులు చేయించారు. వద్దన్నా వినకుండా షర్టు కూడా తీయించారు. ఆ టైమ్ లో చాలా ఇబ్బంది పడ్డా` అని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. అయితే సాంగ్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చిందని.. అవినాశ్ కొల్లా సెట్ తో పాటు శోభి మాస్టర్ గారి కొరియోగ్రఫీ వల్లే అది సాధ్యం అయ్యిందని కళ్యాణ్ రామ్ తెలిపారు.