మళ్లీ మొదటికే వచ్చిన కాజల్ అగర్వాల్ పరిస్థితి.. ఇది అందరికీ సాధ్యం కాదు!!

ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు మగధీర, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మ్యాన్, ఖైదీ నెంబర్ 150 లాంటి సూపర్ హిట్ చిత్రాలలో స్టార్ హీరోల సరసన నటించింది. గత పదేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది కాజల్. ఇక 2020లో వివాహం చేసుకొని తెలుగు ప్రేక్షకులకు దూరమైంది. ఆ తరువాత 2022 లో ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది.

నిజానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లయిన హీరోయిన్స్‌కి క్రేజ్ తగ్గిపోతుంది. ఇక ఆ హీరోయిన్ తల్లి అయింది అంటే మాత్రం ఇండస్ట్రీలోని దర్శకనిర్మాతలకు ఆమెలో హీరోయిన్ మెటీరియల్ అసలు కనపడదు. అందుకే పెళ్లి అయిన హీరోయిన్స్ ఎక్కువగా క్యారెక్టర్ రోల్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది..తరతరాలుగా సినీ ఇండస్ట్రీ లో ఇదొక ఆనవాయితీగా మారిపోయింది. అయితే కాజల్ విజయంలో మాత్రం కథ వేరేలా ఉంది. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం కాజల్ మెయిన్ హీరోయిన్ గా కొన్ని భారీ ప్రాజెక్ట్స్ ని తొందర్లోనే ప్రకటించబోతుంది. వాటిలో ఒకటి దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చే సినిమాలో బాలయ్యతో కలిసి నటించనుంది కాజల్.

అయితే ఈ సినిమా కోసం కాజల్ పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకున్నట్లు సినీ వర్గాల సమాచారం. అయితే బ్రేక్ తీసుకోవడానికి ముందు కాజల్, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో నటించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె పాత్రను ఎడిట్ చేసారు. ఇక నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’లో నటించింది కానీ ఆ పాత్రను కట్ చేసాను. కాజల్ అగర్వాల్ కి ఉన్న క్రేజ్ ప్రేక్షకులలో ఎంతమాత్రం తగ్గలేదు. అలానే పెళ్లి చేసుకొని బ్రేక్ తీసుకున్న తరువాత కూడా ఇండస్ట్రీలో మునుపటిలానే దూసుకెళ్తుందీ అమ్మడు.