సాధారణంగా సినిమాల విషయం పక్కనపెడితే జగపతిబాబు నిజ జీవితంలో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. ఏ విషయం పైన అయినా సరే ముక్కు సూటిగా ఆయన మాట్లాడుతారు.. ఈ లక్షణాలే ఆయనకు ఒక సపరేట్ ఫాలోయింగ్ కూడా తెచ్చిపెట్టాయి.. ఒకప్పుడు టాలీవుడ్ లో ఫ్యామిలీ సినిమాలుకు పెట్టింది పేరు జగపతిబాబు.. మావిడాకులు, పెళ్లి పీటలు, శుభలగ్నం, ఆయనకు ఇద్దరు ,బడ్జెట్ పద్మనాభం ,మనోహరం తదితర కుటుంబ కథా చిత్రాలు ఆయన కెరియర్లో మైల్ స్టోన్ గా నిలిచాయి. ఇకపోతే ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతున్నారు.
ఒకవైపు విలన్ గా మరొకవైపు తండ్రిగా సపోర్టింగ్ రోల్స్ తో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈయన ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ విషయాలను పంచుకున్నారు.. జగపతిబాబు మాట్లాడుతూ..” అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు సినిమా ఇండస్ట్రీలో కూడా అడగాలి.. కానీ అడుక్కున్నట్లు మాత్రం ఉండకూడదు. అలా చేస్తే చులకనగా చూస్తారు.. జగపతిబాబే కదా వస్తాడు.. చేస్తాడు.. డబ్బుల కోసం కాదు అని చులకన భావం ఉంటుంది.
నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 35 ఏళ్ల అవుతోంది.. నాకు బాగా గుర్తుండిపోయిన ఒక చేదు సంఘటన సాహసం సినిమాలో నేను సెకండ్ హీరోగా చేయడం .. ఆ సినిమా షూటింగ్లో ఏడు రోజులపాటు నాకు తిండి పెట్టలేదు.. కనీసం తింటారా? అని కూడా ఎవరు అడగలేదు.. కూర్చోవడానికి కూడా కుర్చీ కూడా వేయలేదు.. అప్పుడు లైట్ బాయ్ కూడా నా దగ్గరకు వచ్చి నా పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. జీవితంలో ముందే కష్టాలను చూస్తే ఆ తర్వాత మిగతా జీవితం సాఫీగా సాగిపోతుందని నా నమ్మకం.. అందుకే అన్నింటినీ భరించాను” అని చెప్పుకొచ్చారు.