తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల పరంగా, సినిమాల పరంగా బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఇవే కాకుండా తన చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా కొద్ది రోజుల క్రితం బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రావడం జరిగింది.
ఈ షోలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన చిన్న వయసులోనే ఒక వ్యాధి గురించి తెలియజేయడం జరిగింది. పవన్ కు ఆస్తమా ఉండేదట దానివల్ల స్కూల్ కి కూడా పవన్ కళ్యాణ్ సరిగ్గా వెళ్లలేకపోయానని తెలియజేశారు. ఆస్తమా ఉండడం వల్ల ఎక్కువ ఇంటి పట్టానే ఉండేవారట. పవన్ కళ్యాణ్ ఎప్పుడు జ్వరంగా ఉండేదని ఆస్తమా వస్తే ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వెంటనే అక్కడ ఇంజక్షన్ వేయించేవారట. అలా తనకు స్నేహితుడు లేక ఇంట్లోనే కేవలం ఒంటరిగా జీవిస్తూ ఉండేవాడినని తెలిపారు.
ఆ సమయంలోనే తనకు పుస్తకాలు దోస్తీ అయ్యాయని స్కూలుకు వెళ్లడం కూడా పవన్ కళ్యాణ్ కు అసలు ఇష్టం ఉండేది కాదని తెలిపారు. అందుకే పరీక్షలు సరిగ్గా రాయక ఫెయిల్ అయ్యారని తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త ఆశ్చర్యపోతున్నారు.