తెలుగు ఇండస్ట్రీలోకి దేవదాసు సినిమా ద్వారా అడుగు పెట్టింది హీరోయిన్ ఇలియానా.అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో తెలుగులో వరుస సినిమాలు చేస్తూ అలరించిన ఇలియానా 2018లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో మళ్లీ తెలుగు తెరపై సందడి చేసింది. ఇక ఈ సినిమా కంటే ముందు ఆరు సంవత్సరాలు తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. దీంతో ఇలియానా మళ్లీ బాలీవుడ్ పైన ఫోకస్ పెట్టింది అప్పటి నుంచి తెలుగులో పెద్దగా కనిపించలేదు.
సౌత్ సినీ ఇండస్ట్రీలో కనిపించకపోవడానికి అసలు కారణం ఏమిటంటే ఇలియానా పై తమిళ చిత్ర పరిశ్రమ నిషేధం విధించిందంటూ వార్తలు వినిపించాయి. అందుకు గల కారణం ఒక అగ్ర నిర్మాత అన్నట్లుగా సమాచారం. అక్కడ ఒక సినిమా చేయడానికి అంగీకరించిన ఇలియానా అందుకు అడ్వాన్స్ కూడా తీసుకున్నాదట. అయితే చిత్రానికి సమయానికి హాజరు కాలేకపోవడంతో ఆమె స్థానంలో మరొక హీరోయిన్ తీసుకొని సినిమా షూటింగ్ చేశారట.ఇక ఆమె అడ్వాన్స్ ఇవ్వాలని కోరగా ఆమె చివరికి ఇవ్వలేదట. దీంతో సదరు నిర్మాత కోలీవుడ్ ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేయడంతో పాటు అలాగే టాలీవుడ్ నిర్మాత మండలిని కూడా ఫిలిం ఛాంబర్ లో ఆయన ఆశ్రయించగా ఇలియానాను బ్యాన్ చేయాలని అభ్యర్థించారట.
దీంతో ఇలియానా పై ఆ సమస్య క్లియర్ అయ్యేంతవరకు ఇలియానా తీసుకోకూడదని నిర్ణయాన్ని నిర్మాతలు మండలి వారు తీసుకున్నట్లు సమాచారం. అందుచేతనే ఇలియానాకు ఇక్కడ అక్కడ అవకాశాలు రాలేదని తెలుస్తోంది.అయితే ఇటీవల ఈ సమస్య కూడా ఇలియానా పరిష్కరించుకుందని త్వరలోనే ఇక్కడ నటించేందుకు అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.