ప్రభాస్ పెళ్లి గురించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు కూడా ప్రభాస్ పెళ్లి కోసం చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. నిత్యం ప్రభాస్ పెళ్లి గురించి ఏమో ఒక వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ప్రభాస్ పై మరొక వార్త వైరల్ గా మారుతోంది .ప్రభాస్ తో కలిసి నటించిన ఆది పురుష్ చిత్రంలోనీ హీరోయిన్ కృతి సనన్ తో ఎంగేజ్మెంట్కు సిద్ధం అయిందని వార్తలు బాలీవుడ్ మీడియా నుంచి తెగ వైరల్ గా మారుతున్నాయి.
కృతి సనన్ తో ప్రభాస్ డేటింగ్ లో ఉన్నారనే వార్తల పై ప్రభాస్ స్పందించడంతో ఈ పుకార్లకు బ్రేక్ పడింది. తాజాగా ప్రభాస్ తో కృతి సనన్ ఎంగేజ్మెంట్ జరగబోతోంది అంటు వార్తలు రావడంతో ఈ విషయంపై ప్రభాస్ టీం స్పందించినట్లుగా తెలుస్తోంది .ప్రభాస్ పై వచ్చిన ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని విషయాన్ని క్లారిటీగా ఇచ్చారు. అంతేకాకుండా ఈ వార్తలు కొంతమంది ఊహించుకొని తమకు తాము సృష్టిస్తున్నవే అంటూ కూడా తెలియజేయడం జరిగింది. ప్రభాస్, కృతి కేవలం జస్ట్ కోస్టార్స్ అంతే అటు క్లారిటీ ఇచ్చారు.
ఇద్దరు కలిసి కేవలం ఆది పురుష్ చిత్రంలోనే నటించారు. అంతకుమించి వీరిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం కూడా లేదని క్లారిటీ ఇచ్చారు. మొదటిసారి వీరిద్దరూ కలిసి నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఏడాది ఈ సినిమా 16 భాషలలో అత్యధిక స్థాయిలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. పీఎఫ్ ఎక్స్ కారణంగా ఈ సినిమా కొద్దిగా ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. అయితే ఎట్టకేలకు వీరి మధ్య ఎలాంటి బంధం లేదని విషయాన్ని తెలిపారు.