సుధీర్ బాబు నటించిన సమ్మోహనం చిత్రం ద్వారా తెలుగుతరకు పరిచయమైంది హీరోయిన్ అతిధిరావు హైదరి. ఇక తర్వాత శర్వానంద్ సిద్ధార్థ తో కలిసి మహాసముద్రం సినిమాలో నటించిన ఇక అప్పటినుంచి నిత్యం వార్తల్లోనే నిలుస్తూ వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ ఏర్పడిన స్నేహం కారణంగానే వీరిద్దరూ డేటింగ్ కు దారితీసిందని వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ కలిసే ఉంటున్నారని సమాచారం తాజాగా శర్వానంద్ నిశ్చితార్థంలో కూడా ఈ జంట కలిసి రావడం జరిగింది.
ఇదంతా ఇలా ఉండగా అతిథి రావు హైదరి మాజీ భర్త సత్యదీప్ మిశ్రా తాజాగా పలు సంచలన ఆరోపణలు చేశారు. 2009లో బాలీవుడ్ నటుడుని అతిధి వివాహం చేసుకుంది. ఇద్దరు పద్య మనస్పర్ధలు కారణం చేత 2013లో విడాకులు తీసుకున్నారు ఇక అప్పటినుంచి ఎవరి దారి వారే చూసుకుంటూ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా సత్యదీప్ మిశ్రా రీసెంట్ గా బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురు మాసభ గుప్తా అని రెండో వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఒక బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ అతిధి రావు హైదరిపైన సత్యదేవ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అతిథితో నా రిలే షన్ కారణంగా ప్రేమ పై నాకు విరక్తి కలిగిందని తెలిపారు..మరొకసారి ప్రేమను పెళ్లి అంటే భయం వేసింది బ్రేకప్ అనుభవం ఎదురైన వాళ్ళు మళ్ళీ రిలేషన్ ప్రేమ అంటే భయపడతారు కానీ ధైర్యంగా ముందడుగు వేస్తేనే కోల్పోయినవి పొందగలమంటూ తెలియజేశారు నటుడు సత్యదీప్ మిశ్రా. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.