టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మొదటి చిత్రం నిన్ను చూడాలని ఉంది.. ఈ సినిమా తో పర్వాలేదు అనిపించుకున్న ఎన్టీఆర్ ఆ తరువాత ఎన్నో విభిన్నమైన సినిమాలలో పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగా అలరించారు. ప్రస్తుతం RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించారు. దీంతో ఆస్కార్ రేసులో కూడా మొదటి స్థానంలో నిలిచారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించిన మొదటి సినిమాలో హీరోయిన్గా రవీనా రాజ్ పుత్ నటించింది. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆ తర్వాత బ్లాక్ బస్టర్ చేయాలని అందుకున్నారు.
ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ రవీనా రాజ్ పుత్ ఆ తర్వాత తెలుగులో మరే సినిమాలో కూడా నటించలేదు. ఈ చిత్రం కంటే ముందు వెంకటేష్ హీరోగా నటించిన ఒంటరి పోరాటం సినిమాలో మాత్రమే కీలకమైన పాత్రల నటించింది. ఇక ఆ తర్వాత నిన్ను చూడాలని సినిమాతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇతర భాషలలో సైతం ఎలాంటి చిత్రాలలో కూడా నటించలేదని తెలుస్తోంది. నిన్ను చూడాలని సినిమా డిజాస్టర్ కావడంతో పూర్తిగా సినీ పరిశ్రమపై ఆసక్తి లేని కారణంగా ఏమే సిని ఇండస్ట్రీకి దూరమైందని వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో చేసేదేమీ లేక ముంబైకి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకొని సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రస్తుతం ఈ హీరోయిన్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి ఈ ఫోటోలలో ఈమెను గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉందంటూ పలువురు అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు.