తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ఎలాంటి చోటైనా సరే హైలెట్గా మారుతూ ఉంటారు. తాజాగా వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఫాన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా డైలాగులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇక అక్కడికి వచ్చిన అతిథులలో రెడ్ డ్రస్సులు హనీ రోజ్ అనే యాక్టర్ కూడా తన అందంతో అక్కడున్న వారందరిని కట్టిపడేసింది. ఇక ఆమె ఎవరాని ఆరా తీయగా మలయాళం లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న బ్యూటీ అన్నట్లుగా తెలుస్తోంది. కేరళలో పుట్టినది హాని రోజ్ .
సినీ ఇండస్ట్రీలోకి 14 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చింది అంటే దాదాపుగా 2005వ సంవత్సరంలోనే మలయాళంలో మొదటి సినిమాలో నటించింది. ఆ తర్వాత అడపాదడప సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ఉండేది. 2012లో రిలీజ్ అయిన త్రివేంద్ర లాడ్జ్ అనే సినిమాతో హనీ రోజ్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక అక్కడ నుంచి మలయాళంలో పలు సినిమాలలో కీరోల్స్ లో నటిస్తూ వచ్చిందట. అలా మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్ తో కలిసి నటించింది హనీ రోజ్. ఇక వీరసింహారెడ్డి తోనే ఈమె మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతోంది.
అయితే తెలుగులో ఆలయం, ఈ వర్షం సాక్షిగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు బాలయ్య సినిమాతో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే పాటల డాన్స్ తో అదరగొట్టేసింది. హని రోజ్ బోల్డ్ పాత్రలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. గత ఏడాది విడుదలైన మాన్ స్టర్ సినిమాలో మంచు లక్ష్మితో కలిసి లిప్ లాక్ లో నటించింది. ప్రస్తుతం ఈమె అందాన్ని చూసి ఫిదా అవుతున్నారు ప్రేక్షకులు.