చిత్ర పరిశ్రమలో ఉండే నటీమణుల్లో డేటింగ్స్ అనేవి సర్వసాధారణం.. పరిశ్రమలో వారికి ఒక వ్యక్తి నచ్చితే చాలు.. వారితో డేటింగ్ మొదలుపెడతారు.. ఇక వారు అ విషయని అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి చిత్ర పరిశ్రమలో ఉన్న చాలామంది నటీమణులు ఇష్టపడరు. అది తమ పర్సనల్ వ్యవహారమని, దానిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కొందరు నటీమణులు మొహం తిప్పేస్తుంటారు.
కానీ వారందరికీ భిన్నంగా బాలీవుడ్ నటి తృప్రి డిమ్రీ మాత్రం వాళ్లకు భిన్నంగా.. తన డేటింగ్ వ్యవహారంపై మీడియాకు అధికార ప్రకటన ఇచ్చేసింది. తాను బాలీవుడ్ స్టార్ నటి అనుష్క శర్మ సోదరుడు నిర్మాత కర్నేష్ శర్మతో డేటింగ్ లో ఉన్నానని న్యూ ఇయర్ కానుకగా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. మై లవ్ అంటూ ఎమోజిలు జత చేసింది.
కర్నేష్ బ్యానర్ లో 2020లో వచ్చిన ‘బుల్ బుల్’ సినిమాతో తృప్రి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలు హీరోయిన్గా పరిచయమైంది. ఈ సినిమా షూటింగ్ దగ్గర నుంచి వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది.. వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడూ ఆ వార్తలు గురించి వేరు పట్టించుకోలేదు ఓపెన్ అవలేదు. తృప్రి రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం ‘తాను కర్నేష్ తో డేటింగ్ లో ఉన్నానే విషయాన్ని రివిల్ చేసింది’. ‘కానీ నా పెళ్ళికి ఇంకా 7 లేదా 8 సంవత్సరాల టైమ్ పడుతుందని ఆమె తెలిపింది’.